E-Paper
Advertisement

ఎంవీ హోండియస్‌’ క్రూయిజ్‌ నౌక నుంచి 40 మంది ప్రయాణికులు బయటకు..

ఎంవీ హోండియస్‌’ క్రూయిజ్‌  నౌక నుంచి 40 మంది ప్రయాణికులు బయటకు..
Advertisement

Hantavirus cruise ship: అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఎంవీ హోండియస్‌ అనే విహారయాత్ర (క్రూయిజ్) నౌకలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నౌకలో ప్రమాదకరమైన ‘హంటావైరస్’ వ్యాపించడంతో ఇప్పటికే ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వైరస్ మరింత మందికి సోకే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నౌకలోని 40 మంది ప్రయాణికులను అత్యవసరంగా బయటకు తీసుకువచ్చిన అధికారులు.. వారిని అట్లాంటిక్ మహాసముద్రంలోని సెయింట్ హెలినా ద్వీపంలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు.

ఈ నౌకలో 22 దేశాలకు చెందిన 88 మంది పర్యాటకులు.. 55 మంది సిబ్బంది ఉన్నారు. విహారయాత్ర కోసం బయలుదేరిన వీరి జీవితాలు వైరస్ వ్యాప్తితో ఒక్కసారిగా తలకిందులయ్యాయి. ప్రయాణికుల్లో కొందరికి తీవ్రమైన జ్వరం.. శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో పరీక్షలు నిర్వహించగా హంటావైరస్ అని తేలింది. ఎలుకల ద్వారా వ్యాపించే ఈ వైరస్ మనుషుల్లో ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల వ్యాధిని కలిగిస్తుంది. పరిస్థితి విషమించకముందే స్పందించిన అధికారులు.. నౌకను నిలిపివేసి బాధితులను తరలించారు.

Advertisement

ప్రస్తుతం సెయింట్ హెలినా ద్వీపంలో ఉన్న ప్రయాణికులకు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. వైరస్ లక్షణాలు లేని వారిని కూడా ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌లో ఉంచారు. నౌకలోని మిగిలిన సిబ్బంది.. ప్రయాణికుల పరిస్థితిని అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు. అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం నౌకను పూర్తిగా శానిటైజ్ చేసే ప్రక్రియను ప్రారంభించారు. విహారయాత్రలో ఉన్న పర్యాటకులు తమ దేశాలకు తిరిగి వెళ్లేందుకు వీలుగా రాయబార కార్యాలయాలు సమన్వయం చేసుకుంటున్నాయి.

హంటావైరస్ కారణంగా ముగ్గురు మృతి చెందడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఎలుకల విసర్జితాలు.. లేదా వాటి లాలాజలం ద్వారా గాలిలోకి విడుదలయ్యే వైరస్ కణాల వల్ల ఈ వ్యాప్తి జరుగుతుంది. క్రూయిజ్ నౌకలో ఈ వైరస్ ఎలా ప్రవేశించింది అనే అంశంపై లోతైన విచారణ జరుగుతోంది. పర్యాటకులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని సెయింట్ హెలినా ద్వీప అధికారులు వెల్లడించారు.

Advertisement

Read Also: కేరళం కొత్త సీఎం ఎంపికపై ఏఐసీసీ కసరత్తు.. ఎమ్మెల్యేల ఓపీనియన్ తీసుకుంటున్న పరిశీలకులు, ఆయన వైపే

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×