E-Paper
Advertisement

Israel War: కుదేలైన ఇజ్రాయెల్ నిర్మాణ రంగం.. భారత్ నుంచి 6,000 మంది శ్రామికులు..!

Israel War: కుదేలైన ఇజ్రాయెల్ నిర్మాణ రంగం.. భారత్ నుంచి 6,000 మంది శ్రామికులు..!
Advertisement

6000 Indian Construction Workers Sending to Israel: గత ఆరు నెలలుగా హమాస్‌-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ లోని నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింది. అక్కడ నిర్మాణ రంగంలో పనిచేసే వారు కరువయ్యారు. దీంతో ఇజ్రాయెల్ నిర్మాణ రంగ కార్మికుల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతోంది. భారతదేశం నుంచి ఇజ్రాయెల్ లో పనిచేసేందుకు 6,000 మంది నిర్మాణ రంగ కార్మికులు అక్కడికి వెళ్లనున్నారు.

హమాస్ ఘర్షణలు కారణంగా ఇజ్రాయెల్ లో నిర్మాణ రంగ శ్రామికులు కరువయ్యారు. ఈ యుద్ధం నేపథ్యంలో అక్కడ భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. యుద్ధం కారణంగా గాజా స్ట్రిప్ పూర్తిగా నాశనమైంది. దీంతో అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఉండేందుకు ఇల్లు, తినేందుకు తిండి, తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్నారు. దీంతో ఇజ్రాయెల్ లో నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులు మధ్యలో నిలిచిపోయాయి.

Advertisement

ఇప్పటివరకు ఇజ్రాయెల్ లో పాలస్తీనా ఆధీనంలోని వెస్ట్ బ్యాంక్ నుంచి 80 వేల మంది, గాజాకు చెందిన 17వేల మంది అక్కడి పనిచేస్తుండేవారు. అయితే యుద్ధం కారణంగా వారికి ఇచ్చిన అనుమతిని ఇజ్రాయెల్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో కార్మికులు కొరత ఏర్పడింది. వారి స్థానాల్లో ఇజ్రాయెల్ విదేశాల నుంచి శ్రామికులను ఆహ్వానిస్తోంది.

Also Read: ఇజ్రాయెల్ దాడిలో హమాస్ లీడర్ హనియే ముగ్గురు కుమారులు మృతి

Advertisement

ఇందులో భాగంగా ఇజ్రాయెల్ కు భారత్ నుంచి 6,000 మంది నిర్మాణ రంగ కార్మికులు వెళ్లనున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వీరందరినీ ఇజ్రాయెల్ కు తరలించనున్నారు. అయితే భారత్ నుంచి అక్కడి చేరుకునే వారికి.. ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇవ్వాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక శాఖ, నిర్మాణ శాఖ సంయుక్తంగా నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×