E-Paper
Advertisement

పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్.. రూ. 2.6 కోట్ల విలువైన గాంజా స్వాధీనం

పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్.. రూ. 2.6 కోట్ల విలువైన గాంజా స్వాధీనం
Advertisement

Kothagudem: సినిమా స్టైల్‌ను కాపీ కొడుతూ అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు స్మగ్లర్లు. ‘పుష్ప’ సినిమాలో లారీలో సీక్రెట్ క్యాబిన్ ఏర్పాటు చేసి ఎర్రచందనం తరలించినట్లుగానే.. ఇక్కడ లారీలో ప్రత్యేక అరను సిద్ధం చేసి భారీగా గంజాయిని రవాణా చేస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, ఈగల్ టీమ్ సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడిలో రూ. 2.6 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది.

ఐటీసీ వెస్ట్ గేట్ వద్ద హైడ్రామా

Advertisement

ఒడిశా-తెలంగాణ సరిహద్దుల గుండా గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ వెస్ట్ గేట్ సమీపంలో పోలీసులు, ఈగల్ టీమ్ నిఘా పెట్టారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఒక అనుమానాస్పద కంటైనర్ లారీని ఆపి తనిఖీ చేశారు. పైకి సాధారణంగానే కనిపించినా, లోపల నిశితంగా పరిశీలించగా లారీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అర బయటపడింది. ఆ అరలో దాచిన 525 కేజీల గంజాయిని చూసి అధికారులు సైతం విస్తుపోయారు. దీని మార్కెట్ విలువ దాదాపు రూ. 2.625 కోట్లు ఉంటుందని అంచనా.

Also Read: రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’పై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు!

Advertisement

ఒడిశా నుంచి యూపీకి కనెక్షన్

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ గంజాయి నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు విషయాలు వెలుగుచూశాయి. ఒడిశాలోని అల్లూరి కోట అటవీ ప్రాంతం నుంచి ఈ గంజాయిని సేకరించి, ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులతో పాటు ఒక మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ముఠాలోని మరో నలుగురు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు.

సీజ్ చేసిన వస్తువులు

నిందితుల నుంచి గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన కంటైనర్ లారీ, ఒక బజాజ్ పల్సర్ బైక్, ఐదు మొబైల్ ఫోన్లు మరియు రూ. 10,570 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నలుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంపై బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×