E-Paper
Advertisement

ITR Extension: ఐటిఆర్ ఫైలింగ్ గడువు పెంపు.. హై వ్యాల్యూ లావాదేవీలపై ఐటీ శాఖ నిఘా

ITR Extension: ఐటిఆర్ ఫైలింగ్ గడువు పెంపు.. హై వ్యాల్యూ లావాదేవీలపై ఐటీ శాఖ నిఘా
Advertisement

ITR Extension| ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి పన్ను దారులందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ, ప్రభుత్వం చివరి నిమిషంలో గడువు తేదీని 2025 జులై 31 వరకు పొడిగించింది. ఈ వార్త కొంతవరకు ఆశ్చర్యం కలిగించేదే. ఎందుకంటే, ఫామ్‌లు నోటిఫై చేసినా, అవి ఆలస్యంగా వచ్చాయి. ఫైలింగ్‌కు అవసరమైన యుటిలిటీలు కూడా సిద్ధంగా లేవు. అయితే ఈ పొడిగింపు అనవసరమని, బదులుగా యుటిలిటీలను సిద్ధం చేయాలని ట్యాక్స్ పేయర్లు అడుగుతున్నారు.

ప్రభుత్వం సాధారణంగా చురుగ్గా పనిచేస్తుంది. కానీ, ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉందో అర్థం కావడం లేదు. గత రెండేళ్లుగా గడువు పొడిగింపు లేకుండా, నిర్దిష్ట వైఖరితో పనులు సకాలంలో జరిగాయి. అందరూ ఈ విధానాన్ని మెచ్చుకున్నారు. సమయానికి పని పూర్తవుతుందని సంతోషించారు. కానీ, ఇప్పుడు యుటిలిటీలు సిద్ధం చేయకుండా 45 రోజులు పొడిగించడం వల్ల కొంతమంది సంతోషించినా, ఇది సమస్యకు పరిష్కారం కాదు.

Advertisement

పొడిగింపు వల్ల అసెస్సీలు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు. పనులు వాయిదా పడతాయి. రెండు నెలల్లో యుటిలిటీలు సిద్ధం కాకపోతే, ఎప్పుడు అవుతాయి? అభివృద్ధి, ఇంటిగ్రేషన్, టెస్టింగ్‌కు సమయం కావాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఎప్పుడు సిద్ధమవుతుందో స్పష్టత లేదు.

సాధారణంగా మే 31 తర్వాత టీడీఎస్ స్టేట్‌మెంట్లు కనిపిస్తాయి. అయితే అవి ఇప్పుడు ఆలస్యమవుతాయి. సిస్టమ్స్ సిద్ధంగా లేకపోవడం మరో సమస్య. ట్యాక్స్ ఆడిట్ కేసులకు గడువు 2025 సెప్టెంబర్ 30. ఈ గడువును కూడా పొడిగిస్తారా అనే స్పష్టత లేదు. జులై 31 తర్వాత వృత్తి నిపుణులు ఆడిట్ కేసులు చేపడతారు. కానీ, రెండు గడువుల మధ్య 15 రోజులు మాత్రమే ఉండటం వల్ల పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి, తప్పులు జరిగే అవకాశం ఉంది.

Advertisement

ఈ పొడిగింపు.. విద్యార్థులకు పరీక్ష తేదీ పొడిగించినట్లే. మొదట సంతోషమైనా, తర్వాత శ్రమ ఎక్కువవుతుంది. పాత సమాచారాన్ని ఎంతకాలం సేకరిస్తాం? యుటిలిటీలు సిద్ధమైన వెంటనే రిటర్నులు దాఖలు చేయండి.

హై వ్యాల్యూ లావాదేవీలపై నిఘా..

ఆదాయపు పన్ను శాఖ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ.. తమ నిజమైన ఆదాయాన్ని దాచే వ్యక్తులను గుర్తించేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. ఆధునిక డేటా విశ్లేషణలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, కో-ఆపరేటివ్ సంస్థలు, ఫిన్‌టెక్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్‌తో ఐటీ శాఖ కలిసి పన్ను ఎగవేతను అరికట్టేందుకు పెద్ద లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తోంది. ఈ సంస్థలు ప్రతి ఏటా మే 31 నాటికి స్టేట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ (SFT) ద్వారా ముఖ్యమైన లావాదేవీల వివరాలను సమర్పించాలి.

పెద్ద లావాదేవీలు అంటే ఏమిటి?

అధిక మొత్తంలో డిపాజిట్లు, ఆస్తుల కొనుగోలు, విక్రయాలు, క్రెడిట్ కార్డు చెల్లింపులు ఈ నిఘా కింద ఉన్నాయి. ఉదాహరణకు, కరెంట్ ఖాతాలో 50 లక్షలకు మించి డిపాజిట్ లేదా ఉపసంహరణ, 30 లక్షలకు మించి ఆస్తి కొనుగోలు లేదా విక్రయం, ఏడాదిలో 10 లక్షలకు మించి క్రెడిట్ కార్డు చెల్లింపులు (నగదు కాకపోయినా) శాఖ దృష్టిలో ఉంటాయి. విదేశీ మారక లావాదేవీలు, మ్యూచువల్ ఫండ్స్ లేదా బాండ్లలో 10 లక్షలకు మించిన పెట్టుబడులు కూడా గమనించబడతాయి. నిర్దేశిత పరిమితిని మించిన ఏ లావాదేవీ అయినా నివేదించాల్సిందే.

అధిక ఖర్చు చేసే వ్యక్తులు తమ ఆదాయాన్ని సరిగ్గా ప్రకటించేలా చేయడానికి ఆదాయపు పన్ను శాఖ ఈ చర్యలు చేపడుతోంది. కొత్త నిబంధనల ప్రకారం.. మీ మొత్తం ఆదాయం 2.5 లక్షల కంటే తక్కువ ఉన్నా, ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయనవసరం లేకపోయినా, బ్యాంకు ఖాతాలో 1 కోటికి మించి డిపాజిట్ చేస్తే, 2 లక్షలకు మించి విదేశీ పర్యటనకు ఖర్చు చేస్తే, లేదా 1 లక్షకు మించి విద్యుత్ బిల్లు చెల్లిస్తే రిటర్న్ దాఖలు చేయాల్సిందే.

Also Read: 50,000 నకలీ ప్రభుత్వ ఉద్యోగులు.. రూ.230 కోట్ల వేతన కుంభకోణం

పెద్ద మొత్తంలో నగదు ఉపసంహరణలపై టీడీఎస్ (టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) విధించబడుతుంది. 1 కోటికి మించి నగదు తీస్తే 2 శాతం టీడీఎస్, రిటర్న్ దాఖలు చేయని వారికి లేదా తరచూ ఎగవేసేవారికి 5 శాతం వరకు విధించవచ్చు. 20 లక్షలకు మించి నగదు తీసినా, రిటర్న్ దాఖలు చేయని వారికి 2 శాతం టీడీఎస్ వర్తిస్తుంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×