E-Paper
Advertisement

ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల లాంచ్ డేట్ ఫిక్స్.. వారెవ్వా.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల లాంచ్ డేట్ ఫిక్స్.. వారెవ్వా.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Ethanol Cars Launched Soon: ప్రపంచ పర్యావరణ దినోత్సవం అయిన జూన్ 5న భారత ఆటోమొబైల్ రంగంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఆ రోజున మారుతి సుజుకి కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ కారును ఆవిష్కరించనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.  ఈ కొత్త మోడల్ కారు పూర్తిగా E100 ఇథనాల్‌ తో నడవనుంది. అంటే, పెట్రోల్ అవసరం లేకుండా 100 శాతం ఇథనాల్ తోనే ఈ కారు పని చేస్తుంది. ఈ కారు దేశంలో ప్రత్యామ్నాయ ఇంధన రంగంలో కీలక ముందడుగు కాబోతోంది.

అధికారికంగా మోడల్ పేరు ప్రకటించకపోయినా..

మారుతి సుజుకి ఇప్పటి వరకు అధికారికంగా మోడల్ పేరును ప్రకటించలేదు. అయితే, గతంలో కంపెనీ ప్రదర్శించిన వాహనాల ఆధారంగా చూస్తే మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ మోడళ్లు ఈ టెక్నాలజీకి అనువుగా ఉండే అవకాశముందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

నితిన్ గడ్కరీ ఏం చెప్పారంటే?

Advertisement

ఇక ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్ల గురించి నితిన్ గడ్కరీ కీలక విషయాలు వెల్లడించారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల వినియోగాన్ని పెంచడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యాలలో ఒకటన్నారు. ఇథనాల్ ఆధారిత ఇంధనం వల్ల విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, అదే సమయంలో కాలుష్యం కూడా తగ్గుతుందని వివరించారు. ప్రస్తుతం దేశం సుమారు 87 శాతం పెట్రోల్, డీజిల్ అవసరాలకు దిగుమతులపై ఆధారపడుతోందని ఆయన గుర్తుచేశారు.

అందుబాటులో E20 ఫ్యూయెల్

దేశంలో ఇప్పటికే E20 ఇంధనం అందుబాటులో ఉంది. ఇకపై E22, E25, E27, E30 లాంటి ఎక్కువ ఇథనాల్ మిశ్రమాల దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు అవసరమైన మౌలిక వసతులు క్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి.

ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల ఇంజిన్ ఎలా ఉంటుంది?

Advertisement

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో సాధారణ పెట్రోల్ ఇంజన్లతో పోలిస్తే కొన్ని మార్పులు అవసరం అవుతాయి. ఇథనాల్ ఎక్కువ తుప్పు పట్టించే గుణం కలిగి ఉండటంతో ఇంధన లైన్లు, ఇంజెక్టర్లు, సీల్స్ లాంటి భాగాలను ప్రత్యేకంగా రూపొందించాలి. అలాగే, ఇంజిన్ ట్యూనింగ్ కూడా మారుతుంది. ఈ మార్పుల వల్ల వాహనం తయారీ ఖర్చు సుమారు రూ.40,000 నుంచి రూ.50,000 వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

మారుతి సుజుకి ఇప్పటికే ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీపై పని చేస్తున్నట్లు గతంలోనే స్పష్టం చేసింది. అయితే, ప్రారంభ దశలో ఉత్పత్తి పరిమితంగా ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో డిమాండ్ పెరిగిన తర్వాత మాత్రమే పెద్ద స్థాయిలో ఉత్పత్తి జరుగుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. E100 ఇథనాల్ వాహనాల ప్రవేశం భారత ఆటోమొబైల్ రంగంలో కొత్త మలుపు కానుంది. ఇథనాల్ పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా భారత ఇంధన స్వావలంబనకు కూడా తోడ్పడుతుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also: ఒకే ఛార్జ్ తో 300 కి.మీ రేంజ్.. తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×