E-Paper
Advertisement

Mother Killed Sons: మహబూబాబాద్‌లో సంచలనం.. ఇద్దరు పిల్లలను హత్య చేసిన తల్లి

Mother Killed Sons: మహబూబాబాద్‌లో సంచలనం.. ఇద్దరు పిల్లలను హత్య చేసిన తల్లి
Advertisement

Advertisement

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన 5 సంవత్సరాల బాలుడి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కన్న తల్లే హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. కే సముద్రం మండలం నారాయణపురం గ్రామంలో పందుల శిరీష(25) ఉపేంద్ర అనే వ్యక్తిని ప్రేమించి 7 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. కొంత కాలం సజావుగా సాగింది వాళ్ల సంసారం. వీళ్లకి ఇద్దరు కుమారులు మనీష్(5), నిహాల్(2)ఉన్నారు.

ఉపేంద్ర మద్యానికి బానిస అవ్వడంతో గొడవలు మెుదలయ్యాయి. దీంతో పిల్లలను, శిరీష ను పట్టించుకునేవాడు కాదు. శిరీష పై అనుమానంతో ఉండేవాడు. దీంతో శిరీష ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. పిల్లల్ని చంపి తాను కూడా చనిపోదామని అనుకుంది.

Advertisement

అనుకున్న ప్రకారం జనవరి 15న నిహాల్‌ను నీటి సంపులో పడేసి చంపింది. సెప్టెంబర్ 24వ తేదీన మనీష్ మెడకు నైలాన్ తాడును బిగించి అతి కిరాతకంగా హత్య చేసింది. సమాచారం తెలుసుకున్న తండ్రి ఘటన స్థలికి వచ్చాడు. కొడుకు మెడపై ఉరి ఆనవాలు కనిపించాయి. అనుమానంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వారి శైలిలో విచారణ చేపట్టగా శిరీష చేసినట్టు తేలింది. పోలీసులు శిరీషపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×