E-Paper
Advertisement

Sand Mafia: రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. వ్యతిరేకించిన టీడీపీ కార్యకర్త పై దాడి

Sand Mafia: రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. వ్యతిరేకించిన టీడీపీ కార్యకర్త పై దాడి
Advertisement

Sand Mafia: ఉమ్మడి గుంటూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. రాత్రి పగలు తేడా లేకుండా అడ్డగోలుగా అక్రమ రవాణా చేస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. గుంటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ లంక భూముల్లో ఇసుక తవ్వకాలు చేయడం గమనించిన స్థానికులు.. టీడీపీ కార్యకర్త శ్రీనివాసరావుకి ఫిర్యాదు చేశారు. దీంతో అతను ఇసుక మాఫియాను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి శ్రీనివాసరావు ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాసరావుకి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వెంటనే సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే తనపై దాడి చేసింది ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అనుచరుడు కంచేటి సాయి అని ఆరోపించాడు. ఇసుక దందాను అడ్డుకుంటున్నందుకు తనపై దాడి చేశారని తెలిపారు. ఎమ్మెల్యే అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×