E-Paper
Advertisement

Crime News: అలా చేశాడని.. 2 కిమీలు వెంటాడి, కారుతో గుద్దేసి మరీ బైకర్‌ను చంపేసిన దంపతులు

Crime News: అలా చేశాడని.. 2 కిమీలు వెంటాడి, కారుతో గుద్దేసి మరీ బైకర్‌ను చంపేసిన దంపతులు
Advertisement

Crime News:  కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకించాడనే కోపంతో.. 2 కిలోమీటర్ల పాటు వెంటాడి మరీ యువకులను కారుతో ఢీ కొట్టిన దంపతులు. ఈ దుర్మార్గమైన ఘటన బెంగళూరులోని జేపీ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మనోజ్, ఆర్తి అనే దంపతులు రాత్రి సమయంలో కారులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో దర్శన్ , వరుణ్ అనే ఇద్దరు యువకులు బైక్ పై వెళ్తున్నారు. ఆ ప్రాతంలో ట్రాఫిక్ ఎక్కువుగా ఉండటంతో కారు మిర్రర్‌కు బైక్ తాకింది.. దీంతో వారి మధ్య ఘర్షణ ఏర్పడింది. గొడవ తర్వాత తిరిగి ఇద్దరు యువకులు బైక్ పై వెళ్తుండగా.. ఆ దంపతులు వారిపై కోపంతో దాదాపు 2 కిలోమీటర్ల పాటు వెంబడించి వారిని కారుతో ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న బాధితులను హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స పొందుతూ దర్శన్ మృతి చెందాడు. నిందితుల పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మెలిక..!

రాములమ్మకి ఏమైంది.?

కావేరి జలాల వివాదం

అభిజిత్‌కి డబ్బులు ఎక్కడివి?

ఆదివాసీ vs పోలీస్.. పట్టుపురుగు పంచాయతీ!

ఇద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరినట్టేనా..?

రాహుల్ కు కేటీఆర్ లేఖ వెనుక వ్యూహం అదేనా!

పేరెంట్స్‌కు హెచ్చరిక.. పిల్లల సరదా ప్రాణాంతకం!

Big Stories

Advertisement
×