E-Paper
Advertisement

CM Revanthreddy : ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. గంటసేపు చర్చలు..

CM Revanthreddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సీఎం ప్రధానిని కలవడం ఇదే మొదటి సారి. ఈ సందర్భంగా సీఎం రాష్ట్ర విభజన హామీల గురించి చర్చించారు.

CM Revanthreddy : ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. గంటసేపు చర్చలు..
Advertisement

CM Revanthreddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సీఎం ప్రధానిని కలవడం ఇదే మొదటి సారి. ఈ సందర్భంగా సీఎం రాష్ట్ర విభజన హామీల గురించి చర్చించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థతి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించారు. రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్రం నుంచి రావాల్సిన వాటాపై చర్చించారు. అదే విధంగా పాలమూరు – డిండి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని సీఎం ప్రధాని మోదీని విన్నవించారు.

Advertisement

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసమే ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రధాని మోడీతో భేటీ అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డితో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన అనేక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరామని భట్టి తెలిపారు.

బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాట్లు చేయాలని ప్రధానిని విన్నవించినట్లు చెప్పారు. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వాలని, ఐటీఐఆర్‌ ప్రాజెక్టులు ఇవ్వాలని ప్రధాని మోడీని విజ్జప్తి చేసినట్లు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించామని భట్టి విక్రమార్క వెల్లడించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×