E-Paper
Advertisement

Train Coaches: సముద్ర జలాల్లో రైలు బోగీల సమాధి, ఎందుకలా?

Train Coaches: సముద్ర జలాల్లో రైలు బోగీల సమాధి, ఎందుకలా?
Advertisement

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశంగా అమెరికా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైల్వే నెట్ వర్క్ ను ప్రజా రవాణా కంటే సరుకు రవాణాకే ఎక్కువగా వినియోగిస్తారు. అన్ని ముఖ్య నగరాల్లో అత్యాధునిక మెట్రో వ్యవస్థ అందుబాటులో ఉంది. తక్కువ ఖర్చులో ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తోంది. అయితే, న్యూయార్క్ నగరానికి చెందిన సబ్ వే రైల్వే కోచ్ లను అట్లాంటిక్ మహా సముద్రంలో పడేస్తుంది. విధుల్లో నుంచి తప్పించిన బోగీలను సముద్ర జలాల్లో సమాధి చేస్తుంది. న్యూయార్క్ అధికారులు ఇప్పటి వరకు సుమారు 2500 రైల్వేకోచ్ లను సముద్రంలో పడేశారు. ఎందుకు అలా చేస్తున్నారు? కనీసం పాత ఇనుప సామానుకైనా అమ్మేస్తే డబ్బులు వస్తాయి కదా? అని చాలా మంది అనుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే?

ప్రపంచంలోనే పురాతన సబ్ వే ట్రాన్స్ పోర్టు సిస్టమ్!

Advertisement

అమెరికాలో అత్యంత ఎక్కువ మంది జనాభా ఉండే నగరం న్యూయార్క్. ఈ నగరం అతిపెద్ద ప్రజా రవాణ వ్యవస్థను కలిగి ఉంది. ప్రతి రోజు కొన్ని వేల మంది ప్రయాణీకులు న్యూయార్క్ లోని సబ్ వే ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ ద్వారా రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఈ రైళ్లు 24 గంటల పాటు నడుస్తూనే ఉంటాయి. ఈ సబ్ వే లైన్ న్యూయార్క్ లోని అన్ని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ వెళ్తుంది. ఇది ప్రపంచంలోనే పురాతన సబ్ వే ట్రాన్స్ పోర్టు వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకుంది. 1907 అక్టోబర్ 7న న్యూయార్క్ సబ్ వే ట్రాన్స్ పోర్టు ప్రారంభం అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన సర్వీసులను కొనసాగిస్తూనే ఉంది. మొత్తం 472 స్టేషన్లను కలిగి ఉంది.

Read Also:  4.5 గంటల్లో రైల్వే బ్రిడ్జి నిర్మాణం, ఇండియన్ రైల్వే సరికొత్త రికార్డు!

Advertisement

సబ్ వే రైల్ కోచ్ లను సముద్రంలో ఎందుకు పడేస్తున్నారు?

ఏండ్ల పాటు ప్రయాణీకులకు సేవలను అందించి పలు రైళ్లు తమ సర్వీసుల నుంచి తప్పుకుంటున్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా పాతవాటిని రన్ చేయడం కష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యం న్యూయార్క్ సిటీ గవర్నమెంట్ పాడైపోయిన సబ్ వే బోగీలను సముద్రంలో పడేయాలని నిర్ణయించింది. 2001 నుంచి 2010 వరకు సుమారు 2000 బోగీలను నీళ్లలో పడేశారు. ఇలా చేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందనే అనుమానం కలుగతుంది కదా? కానీ, ఆ అనుమానంలో నిజం లేదు. ఈ రైలు బోగీలు సముద్రం అడుగు భాగంగాలో చేపలు సహా ఇతర జీవులకు నివాస యోగ్యమైన ఆర్టిఫీషియల్ ఇళ్లలాగా పని చేస్తున్నాయి. అయితే. ఈ రైల్ కోచ్ లను సముద్రంలో పడేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. విండో గ్లాస్ లు, సీట్లు, సైన్ బోర్డులు, వీల్స్, పెట్రోలియం ప్రొడక్టులను తొలగిస్తాయి. కోచ్ క్లీనింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత సముద్రం నీళ్లు ఆ కోచ్ లోకి ఈజీగా వెళ్లేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ తర్వాత వాటిని నీళ్లలోకి వదులుతారు.

Read Also: వేల టన్నుల బరువు ఉండే క్రూయిజ్ షిప్ సముద్రంలో మునగదు, ఎందుకో తెలుసా ?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×