E-Paper
Advertisement

Viral Video: రెండు సార్లు రైలు నుంచి కింద పడింది.. చివరికి, మూడోసారి..

Viral Video: రెండు సార్లు రైలు నుంచి కింద పడింది.. చివరికి, మూడోసారి..
Advertisement

Dramatic Railway Incident: రైల్వే ప్రయాణీకులు ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని రైల్వే అధికారులు పదే పదే చెప్తూనే ఉంటారు. ప్రయాణీకులు చేసే పొరపాట్లు ప్రమాదాలకు ఎలా కారణం అవుతాయి? ప్రాణాలు ఎలా పోతాయి? అనేది పలు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. రైలు రన్నింగ్ లో ఉండగా దిగుతూ, ఎక్కుతూ పడిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలా ఉన్నాయి. ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సంఘటనలూ ఉన్నాయి. తాజాగా మరో షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళ రైలు ఎక్కేందుకు ప్రయత్నించి రెండు సార్లు పడిపోయింది. మూడోసారి కష్టం మీద ఎక్కింది. తృటిలో రెండుసార్లు ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.

ఇంతకీ అసలు ఆ వీడియోలో ఏం ఉందంటే?

తాజాగా ఓ మహిళ రైలు కదులుతుండగా ఎక్కేందుకు ప్రయత్నించింది. మెట్ల మీద ఉండగా స్లిప్ అయ్యి పడిపోయింది. కాస్త అటు ఇటు అయినా, ప్లాట్ ఫారమ్, రైలు మధ్య ఉన్న గ్యాప్ లో పడిపోయేది. పడి లేచిన తర్వాత మరోసారి రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది. అప్పుడు కూడా సరిగా ఎక్కలేకపడిపోయింది. ఆమె సంచి మాత్రం రైల్లోనే ఉండిపోయింది. అప్పటికే కొంత మంది యువకులు అక్కడికి చేరారు. అయినా ఆమె మరోసారి ఎక్కేందుకు ప్రయత్నించింది. అప్పుడు కాస్త రైలు లోపలికి వెళ్లింది. అయినా పడిపోయే పరిస్థితి రావడంతో లోపల ఉన్న వ్యక్తి ఆమె చెయ్యి పట్టుకుని పడిపోకుండా ఆపాడు. మొత్తంగా రెండుసార్లు ప్రాణాలు పోయే పరిస్థితికి తెచ్చుకుని, మూడోసారి బలవంతంగా రైలు ఎక్కగలిగింది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

Advertisement

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అక్కడ రైల్వే పోలీసులు లేకపోవడాన్ని, ఆమెను వారించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. “ప్రాణాలను పణంగా పెట్టి రైలు ఎక్కాల్సిన అవసరం ఏముంది? ఈ రైలు కాకపోతే, మరోరైలు. ప్రాణాలు పోతే రావు కదా?” అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. “ఆవిడ రైలు ఎక్కేందుకు అంతలా ప్రయత్నిస్తుంది అంటే, అందులో తన పిల్లలు ఉండొచ్చు” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఆవిడ అన్నిసార్లు పడిపోతున్నా, కనీసం ఎవరూ సాయం చేయలేకపోయారు” అని మరో వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొత్తంగా నెటిజన్లు కొంత మంది ఆమెను తిడుతుంటే, మరికొంత మంది ఆమె అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆలోచించాలంటున్నారు.

Advertisement

Read Also: మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతలు, ఈ టైమ్ లో దుబాయ్‌ కి వెళ్లడం సేఫేనా?

ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది కచ్చింగా తెలియకపోయినా, ఢిల్లీ-ఆగ్రా రైల్లో జరిగిందని కొంత మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. రైల్వే అధికారులు ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read Also: మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతలు, 850 ఇండియన్ ఫ్లైట్స్ క్యాన్సిల్!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×