E-Paper
Advertisement

Vande Bharat ID Rules: వందే భారత్ ట్రైన్ ఎక్కుతున్నారా? ఇలా చేయకుంటే, నెక్స్ట్ స్టేషన్ లో దింపేస్తారు.. జాగ్రత్త సుమా!

Vande Bharat ID Rules: వందే భారత్ ట్రైన్ ఎక్కుతున్నారా? ఇలా చేయకుంటే, నెక్స్ట్ స్టేషన్ లో దింపేస్తారు.. జాగ్రత్త సుమా!
Advertisement

Vande Bharat ID Rules: దేశంలోని అత్యాధునిక రైలు సేవల్లో వందే భారత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటివరకు అనేక నగరాలను కలుపుతూ ఈ ఎక్స్‌ప్రెస్‌లు ప్రజల మద్దతు తెచ్చుకున్నాయి. ఇక తాజాగా శ్రీనగర్ నుంచి కత్రా వరకు ప్రారంభమైన వందే భారత్ రైలు సేవలు, జమ్మూ-కాశ్మీర్ ప్రజలకు, పర్యాటకులకు, ముఖ్యంగా వైష్ణో దేవి, అమర్‌నాథ్ యాత్రికులకు మంచి అవకాశం కల్పిస్తున్నాయి.

ఈ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని పొందాలంటే, మీరు కచ్చితంగా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా టికెట్ మాత్రమే కాదు, గుర్తింపు పత్రం తప్పనిసరిగా ఉండాలి. మీరు టికెట్ తీసుకున్న పేరు, మీ ఐడి కార్డు పేరు రెండూ సరిపోకపోతే, మీరు రైలులో ప్రయాణించలేరు. ఇది చిన్న విషయం అనిపించవచ్చు కానీ, చాలా మందికి రైలు ఎక్కే సమయానికి ఇదే పెద్ద సమస్యగా మారుతోంది.

Advertisement

ఏంటా సమస్య?
వందే భారత్ రైలు టికెట్‌ను మీరు IRCTC వెబ్‌సైట్ ద్వారా లేదా రైల్వే స్టేషన్ కౌంటర్ ద్వారా బుక్ చేసినప్పుడు, గుర్తింపు పత్రాన్ని సమర్పించాలి. ఇది ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన పత్రం కావాలి. ఉదాహరణకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ వంటివి చెల్లుతాయి. టికెట్‌పై ఉన్న పేరు పూర్తిగా IDలో ఉన్న పేరుతో సరిపోలాలి. ఒకవేళ టికెట్‌లో Rahul Sharma అని ఉంటే, IDలో కూడా అదే పేరుతో ఉండాలి. R. Sharma లేదా Rahul S అని ఉంటే టీటీఈ అనుమతించరు. ఇది ప్రయాణ సమయంలో సమస్యను కలిగించవచ్చు, అంతేకాదు మీరు జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది.

మీరు ఇతరుల కోసం టికెట్ బుక్ చేస్తే వారి పూర్తి పేరు, వయసు, వారు చూపించగలిగే ID వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సీనియర్ల కోసం టికెట్ తీస్తే, వారి ఐడీ డీటెయిల్స్ ముందుగానే తెలుసుకుని టికెట్‌ లోపల నమోదు చేయండి. టికెట్, ID పేర్లు వేరుగా ఉంటే, వారి ప్రయాణాన్ని టీటీఈ నిరాకరించే అవకాశముంది. ఆ సమయంలో ఎంత వాదించినా ప్రయోజనం ఉండదు.

Advertisement

ఇలాంటి కఠిన నిబంధనల వెనుక ఉన్న అసలైన కారణం భద్రత. శ్రీనగర్-కత్రా మార్గం మతపరమైన ప్రాధాన్యత ఉన్న ప్రదేశాలను కలుపుతుంది. అమర్‌నాథ్ గుహలు, వైష్ణో దేవి ఆలయం వంటి తీర్థయాత్రల గమ్యస్థానాలపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భద్రత పరంగా ఈ ప్రాంతాల్లో సెక్యూరిటీ పరీక్షలు కఠినంగా అమలు అవుతుంటాయి. ప్రయాణికుల వివరాలను ముందే రిజిస్టర్ చేయడం వల్ల, అనవసర ఆలస్యం లేకుండా ట్రావెల్ చెయ్యడం వీలవుతుంది. ప్రత్యేకించి ప్రయాణికుల గుర్తింపును వేరేగా నిర్ధారించేందుకు, టికెట్ మరియు ID మధ్య సరిపోలే వివరాలు తప్పనిసరిగా చూస్తారు.

ఇంకా కొన్ని సందర్భాల్లో, టికెట్‌ను తీసుకున్నవారి బదులుగా ఇంకొకరు ప్రయాణిస్తే, వారిని రైలు దింపే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని సంఘటనల్లో ప్రయాణికులు ID చూపించలేక పక్కనుండే సీటు ఖాళీగా ఉండిపోయిన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి మీ ఐడీ కార్డు హార్డ్ కాపీ లేదా మొబైల్‌లో స్కాన్ కాపీ అయినా వెంట ఉంచుకోండి. ప్రయాణ సమయంలో క్షణకాలపాటు కూడా ఆలస్యం జరగకుండా చూసుకోవాలి.

Also Read: Secunderabad Station New Look: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. రంగు పడింది.. రూపం మారింది.. లుక్కేయండి!

ఈ మార్గం ప్రత్యేకత ఏంటంటే, ఇది కేవలం రెండు పట్టణాల మధ్య ప్రయాణం మాత్రమే కాదు. ఇది మన మతపరమైన నమ్మకాలకు, యాత్రలకు మార్గం. వేగవంతమైన ప్రయాణంతో పాటు, దూరాన్ని తగ్గిస్తూ, ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తోంది. ఎలక్ట్రిక్ ఇంజిన్, ఆధునిక కోచ్‌లు, భద్రతా నిబంధనలతో కూడిన ఈ వందే భారత్ ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనది. కానీ ఈ ప్రయాణంలో చిన్న పొరపాట్లకు చోటులేదు. ఐడీ లేకపోవడం వల్ల, మీరు చేయాలనుకున్న తీర్థయాత్రే నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది.

ప్రయాణానికి ముందు ఓ చిన్న చెక్‌లిస్ట్ తయారుచేసుకోండి. టికెట్ ఉందా? ID పత్రం సిద్ధంగా ఉందా? పేర్లు సరిపోతున్నాయా? ఇతరుల కోసం టికెట్ తీస్తే వారి డీటెయిల్స్ సరిగా ఉన్నాయా? అన్నీ ఒకసారి తనిఖీ చేసుకున్నాకే మీరు వందే భారత్ రైలులో ప్రయాణానికి సిద్ధం కావాలి. ఇలా ముందే జాగ్రత్తలు తీసుకుంటే మీ ప్రయాణం సుఖదాయకంగా ఉంటుంది. లేకపోతే రైల్వే పోలీసులకు, టీటీఈలకు వివరణలు ఇచ్చే టైమ్‌లో మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే.

వందే భారత్ రైలు మీద నడిచే ఈ ప్రయాణం ఓ అనుభూతి. అది వేగానికి ప్రతీక. కానీ ఆ ప్రయాణం ఆగిపోకుండా, మీ సీటు మీకే ఉండాలంటే, టికెట్‌కి సరిపడే ID పత్రం మీ వద్ద ఉండాలనే విషయం మాత్రం ఎప్పటికీ మరిచిపోకండి!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×