E-Paper
Advertisement

ఒకప్పుడు పాక్ లో.. ఇప్పుడు ఇండియాలో.. ఈ అందమైన గ్రామం గురించి మీకు తెలుసా?

ఒకప్పుడు పాక్ లో.. ఇప్పుడు ఇండియాలో.. ఈ అందమైన గ్రామం గురించి మీకు తెలుసా?
Advertisement

Beautiful Border Village with a Unique History: దేశంలో ఎన్నో అందమైన గ్రామాలు ఉన్నాయి. అయితే వాటిలో లడఖ్‌ లోని తుర్తుక్. ఈ  గ్రామా నికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ప్రకృతి అందాలతో పాటు, ఈ గ్రామం గతం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఈ గ్రామం భారత్ లో కలిసిపోవడం దీనికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.

యుద్ధానికి ముందు పాక్ లో.. తర్వాత భారత్ లో..

1971 యుద్ధానికి ముందు తుర్తుక్ గ్రామం పాకిస్తాన్ ఆధీనంలో ఉండేది. యుద్ధం సమయంలో భారత సైన్యం ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. దీంతో అక్కడి ప్రజల జీవితంలో ఒకేసారి పెద్ద మార్పు వచ్చింది. ఒక రాత్రి వరకు పాకిస్తాన్‌లో ఉన్నామని భావించిన గ్రామస్తులు, మరుసటి రోజు లేచేసరికి భారతదేశ పౌరులుగా మారిపోయారు. ఈ సంఘటన ఇప్పటికీ ఈ గ్రామ చరిత్రలో అత్యంత విశేషమైన ఘట్టంగా చెప్పుకుంటారు. యుద్ధం తర్వాత భద్రతా కారణాల వల్ల ఈ ప్రాంతాన్ని చాలా సంవత్సరాల పాటు సాధారణ పర్యాటకులకు అనుమతించలేదు. దాదాపు 2009 వరకు తుర్తుక్ బయటి ప్రపంచానికి దూరంగానే ఉంది. తర్వాత పర్యాటకులకు అనుమతి ఇవ్వడంతో ఈ గ్రామం గురించి ప్రపంచానికి తెలిసింది. ప్రస్తుతం లడఖ్ వెళ్లే పర్యాటకులు తప్పకుండా సందర్శించే ప్రాంతాల్లో ఇది కూడా ఒకటిగా మారింది.

ఇప్పుడు టూరిస్టుల ఫేవరెట్!

Advertisement

తుర్తుక్ గ్రామం ప్రకృతి అందాలకు కూడా ప్రసిద్ధి చెందింది. కారకోరం పర్వత శ్రేణుల మధ్య, ష్యోక్ నది ఒడ్డున ఉన్న ఈ గ్రామం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. మంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఆప్రికాట్ పండ్ల తోటలు ఈ గ్రామానికి ప్రత్యేక ఆకర్షణ. పండ్ల సీజన్‌లో మొత్తం ప్రాంతం మరింత అందంగా కనిపిస్తుంది. ఈ గ్రామంలో నివసించే ప్రజలు ఎక్కువగా బాల్టి సమాజానికి చెందినవారు. వారి జీవన విధానం, సంప్రదాయాలు, ఆచారాలు ఇప్పటికీ ప్రత్యేకంగా కనిపిస్తాయి. దేశంలో సంప్రదాయ బాల్టి సంస్కృతిని దగ్గరగా చూడాలంటే తుర్తుక్ కు వెళ్లాల్సిందే. అక్కడి ప్రజలు బాల్టి, లడఖీ భాషలను ఎక్కువగా మాట్లాడుతారు.

తుర్తుక్ గ్రామం లడఖ్‌లోని లేహ్ పట్టణానికి దాదాపు 205 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న భారతదేశపు చివరి గ్రామాల్లో ఒకటి. అందువల్ల ఈ ప్రాంతానికి వ్యూహాత్మకంగా కూడా చాలా ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం తుర్తుక్ గ్రామం.. చరిత్ర, సంస్కృతి, ప్రకృతి అందాలతో దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఒకప్పుడు సరిహద్దు ఉద్రిక్తతలకు గుర్తుగా నిలిచిన ఈ గ్రామం, ఇప్పుడు శాంతి, ప్రకృతి సౌందర్యం, ప్రత్యేక సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది.

Advertisement

Read Also: లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×