E-Paper
Advertisement

Train Ticket Booking: జస్ట్ 25% పేమెంట్ తో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు! ఎలాగో తెలుసా?

Train Ticket Booking: జస్ట్ 25% పేమెంట్ తో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు! ఎలాగో తెలుసా?
Advertisement

Indian Railways: సాధారణంగా రైలు ప్రయాణం చేయాలనుకునే వాళ్లు ముందుస్తుగా టికెట్లు బుక్ చేసుకుంటారు. రకరకాల యాప్స్ ద్వారా టికెట్లు తీసుకుంటారు. అయితే, టికెట్ కొనుగోలు కోసం పూర్తి అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ టికెట్ కన్ఫార్మ్ కాకపోతే, మీ అమౌంట్ తిరిగి రీఫండ్ అవుతుంది. కానీ, ఇకపై జస్ట్ 25 శాతం డబ్బులు పే చేసి టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. అంత తక్కువ అమౌంట్ తో టికెట్ బుకింగ్ ఎలా? అనుకుంటున్నారా? అయితే, మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే..

25 శాతం పేమెంట్ తో రైలు టికెట్ బుకింగ్

Advertisement

చాలా మంది నిత్యం రైలు ప్రయాణం చేసినా, రైల్వే సంస్థతో పాటు ఇతర ట్రావెల్ యాప్స్ అందిస్తున్న ఆఫర్ల గురించి పెద్దగా తెలియదు. అలాంటి వారికి ఇప్పుడు మేం ఓ సూపర్ ఫీచర్ గురించి చెప్పబోతున్నాం. ఈ ఫీచర్ ఉపయోగించి.. కేవలం 25 శాతం డబ్బులు పే చేసి రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు. మిగతా 75 శాతం టికెట్ ఛార్జీ రైలు ప్రయాణానికి 24 గంటల ముందు చెల్లించాల్సి ఉంటుంది. దానికి కూడా ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. ఈ ఫీచర్ పేరు ‘సీట్ లాక్ ఫీచర్’. ఇది కేవలం మేక్ మై ట్రిప్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ను ఉపయోగించి టికెట్ ఎలా బుక్ చేసుసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం..

‘సీట్ లాక్ ఫీచర్’ను ఇలా ఉపయోగించుకోండి!

Advertisement

⦿ ‘సీట్ లాక్ ఫీచర్’ను ఉపయోగించుకోవాలనుకునే వాళ్లు ముందుగా మేక్ మై ట్రిప్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

⦿ ఆ తర్వాత యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి.

⦿ మేక్ మై ట్రిప్ యాప్ ను ఓపెన్ చేయాలి.

⦿ ఆ తర్వాత ‘సెర్చ్ ఫర్ ఏ ట్రైన్’ ఆప్షన్ లోకి వెళ్లాలి.

⦿ మీరు ఎక్కాల్సిన, దిగాల్సిన స్టేషన్ల వివరాలను ఎంటర్ చేయాలి.

⦿ మీరు వెళ్లాల్సిన రూట్ లో అందుబాటులో ఉన్న రైళ్ల వివరాలు కనిపిస్తాయి.

⦿ మీకు నచ్చిన రైలును సెలెక్ట్ చేసుకోవాలి. ట్రావెలర్ వివరాలను ఎంటర్ చేయాలి.

⦿ కిందికి స్క్రోల్ చేయాలి. పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది.

⦿ డబ్బులు ఎలా పే చేస్తారు? అని అడుగుతుంది. రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి.

⦿ ‘పే ఫుల్ అమౌంట్’ అనే ఆప్షన్ తో పాటు ‘అవైల్ సీట్ లాక్ అండ్ పే 25 పర్సెంటేజ్ నౌ’ అనే ఆప్షన్ ఉంటుంది.

⦿ ‘అవైల్ సీట్ లాక్ అండ్ పే 25 పర్సెంటేజ్ నౌ’ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత పేమెంట్ చేయాలి.

⦿  మీ సీటు కన్ఫార్మ్ అవుతుంది. రైలు ప్రయాణానికి ముందుకు మిగతా 75 శాతం అమౌంట్ ను చెల్లించాల్సి ఉంటుంది.

ఈ చక్కటి ఫీచర్ గురించి మీ ఫ్రెండ్స్ తో పాటు తెలిసిన వారికి షేర్ చేసి, ట్రైన్ టికెట్లను ఈజీగా బుక్ చేసుకునేలా సాయపడండి!

Read Also: ఇకపై మీ ట్రైన్ టికెట్ 100% కన్ఫార్మ్.. లేదంటే 3 రెట్లు డబ్బు వెనక్కి!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×