E-Paper
Advertisement

Viral News: ప్రయాణీకుడి కాలర్ పట్టుకుని సమోసాల విక్రేత దౌర్జన్యం.. కేసు నమోదు చేసిన పోలీసులు!

Viral News: ప్రయాణీకుడి కాలర్ పట్టుకుని సమోసాల విక్రేత దౌర్జన్యం.. కేసు నమోదు చేసిన పోలీసులు!
Advertisement

Jabalpur Railway Station Viral Video:

డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత ఎవరి పర్సులో డబ్బులు ఉండటం లేదు. చాక్లెట్ కొనుగోలు చేసినా, ఫోన్ పే, లేదంటే గూగుల్ పే చేస్తున్నారు. కొన్నిసార్లు పేమెంట్స్ సక్సెస్ కాక చాలా మంది ఇబ్బందులు పడిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా ఓ రైల్వే ప్రయాణీకుడికి అచ్చంగా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. రైల్వే స్టేషన్ లో స్నాక్స్ తీసుకున్నాడు. యుపిఐ ద్వారా డబ్బులు పే చేస్తే ఫెయిల్ అని వచ్చింది. ఓ వైపు రైలు కదులుతుంది. మరోవైపు స్నాక్స్ అమ్మేవ్యక్తి డబ్బులు ఇవ్వాలంటూ కాలర్ పట్టుకుని బెదిరించాడు. చేసేదేమీ లేక తన చేతికి ఉన్న స్మార్ట్ ఫోన్ ను ఇచ్చి వెళ్లి రైలు ఎక్కాడు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

అక్టోబర్ 17న మధ్య ప్రదేశ్ లోని ఓ వ్యక్తి రైలు ప్రయాణం చేస్తున్నాడు. జబల్పూర్ స్టేషన్ కు చేరుకోగానే అతడు దిగి స్నాక్స్ తెచ్చుకోవడానికి వెళ్లాడు. సుమారు రూ. 180 విలువ చేసే స్నాక్స్, ఇతర తినుబండారాలు తీసుకున్నాడు. యుపిఐ పేమెంట్ చేశాడు. కానీ, అది ఫెయిల్ అయ్యింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో రైలు కూడా కదులుతుంది. ఈ సమయంలో సమోసా విక్రేత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకో అడుగు ముందుకు వేసి కాలర్ పట్టుకున్నాడు. అందరూ చూస్తుండగానే దౌర్జన్యం చేశాడు. సదరు ప్రయాణీకుడు చేసేదేమీ లేక, ఎక్కడ రైలు మిస్ అవుతానేమోనని తన చేతికి ఉన్న స్మార్ట్  వాచ్ ను తీసి ఇచ్చి.. పరిగెత్తుకెళ్లి రైలు ఎక్కాడు.

విక్రేతపై కేసు నమోదు చేసిన పోలీసులు 

Advertisement

ఓ ప్రయాణీకుడు ఈ గొడవను తన సెల్ ఫోన్ లో షూట్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. క్షణాల్లోనే ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు సీరియస్ అయ్యారు.విక్రేతపై రైల్వే చట్టంలోని సెక్షన్ 145 కింద కేసు నమోదు చేశారు.  “సమోసా విక్రేత, ప్రయాణీకుడి పట్ల వ్యవహరించిన తీరు నిజంగా దారుణం. డబ్బులు ఉన్నప్పటికీ, తను పే చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అతడి ప్రతిష్టకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడం నిజంగా దారుణం. ఇలాంటి ప్రవర్తన మళ్లీ రిపీట్ కాకూడదని హెచ్చరించాం” అని పోలీసులు తెలిపారు.

నెటిజన్లు ఏం అంటున్నారంటే?

అటు  ఈఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “నలుగురిలో ప్రయాణీకుడి కాలర్ పట్టుకుని వేధించడం నిజంగా సమర్థించే సంఘటన కాదంటున్నారు. మర్యాదస్తుడైన సదరు ప్రయాణీకుడు ఈ ఘటనతో షాకయ్యాడు. అందుకే, తన చేతికి ఉన్న విలువైన స్మార్ట్ వాచ్ ను ఇచ్చేసి వెళ్లాడు. నిజానికి రూ. 180 కోసం అంతగా వేధించాల్సిన అవసరం లేద” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.  “డబ్బులు చెల్లించి ఉండకపోతే, తన స్నాక్స్ తాను తీసుకుంటే సరిపోయేది. ఇంత రభస చేయాల్సిన అవసరం లేదు” అని ఇంకో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. అటు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Read Also: తప్పుడు వీడియోలు షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవు, రైల్వే సీరియస్ వార్నింగ్!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×