E-Paper
Advertisement

వైజాగ్ నుంచి సమ్మర్ స్పెషల్ రైళ్లు, ఎప్పటి నుంచి నడుస్తాయంటే?

వైజాగ్ నుంచి సమ్మర్ స్పెషల్ రైళ్లు, ఎప్పటి నుంచి నడుస్తాయంటే?
Advertisement

Indian Railways  Summer Special Trains: వేసవి సెలవులు దగ్గర పడుతున్న నేపథ్యంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతుంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏప్రిల్, మే నెలల్లో ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ఈ స్పెషల్ ట్రైన్లు నడపాలని నిర్ణయించింది. ముఖ్యంగా విశాఖపట్నం, భువనేశ్వర్ లాంటి నగరాలకు వెళ్లే ప్యాసింజర్స్ కు ఈ రైళ్లు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించనున్నాయి.

⦿విశాఖపట్నం–శాలిమార్ మధ్య నడిచే వీక్లీ స్పెషల్ రైలు (08508/08507)..  ఏప్రిల్ 7 నుంచి జూన్ 30 వరకు ప్రతి మంగళవారం ఉదయం 11:20 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 3:00 గంటలకు శాలిమార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఏప్రిల్ 8 నుంచి జూలై 1 వరకు ప్రతి బుధవారం ఉదయం 5:00 గంటలకు శాలిమార్ నుంచి బయలుదేరి, అదే రోజు రాత్రి 8:50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది.

Advertisement

⦿ భువనేశ్వర్–యశ్వంత్‌ పూర్ మధ్య కూడా వీక్లీ స్పెషల్ రైలు నడుస్తుంది. ఇది ఏప్రిల్ 4 నుంచి జూన్ 27 వరకు ప్రతి శనివారం సాయంత్రం 7:15 గంటలకు భువనేశ్వర్ నుంచి బయలుదేరి, అర్ధరాత్రి 12:15 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఏప్రిల్ 6 నుంచి జూన్ 29 వరకు ప్రతి సోమవారం ఉదయం 4:30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6:00 గంటలకు భువనేశ్వర్ చేరుతుంది. మొత్తం ఈ సర్వీసులు 13 ట్రిప్పులను అందిస్తుంది.

⦿ సంబల్‌ పూర్–ఈరోడ్ మధ్య నడిచే ప్రత్యేక రైలు (08311/08312) కూడా అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఏప్రిల్ 1 నుంచి మే 27 వరకు ప్రతి బుధవారం ఉదయం 11:35 గంటలకు సంబల్‌పూర్ నుంచి బయలుదేరి, గురువారం రాత్రి 10:50 గంటలకు ఈరోడ్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు బయలుదేరి, శనివారం రాత్రి 11:15 గంటలకు సంబల్‌పూర్ చేరుతుంది. మొత్తం తొమ్మిది ట్రిప్పులు వేస్తుంది.

Advertisement

⦿ యశ్వంత్‌ పూర్–కతిహార్ మధ్య కూడా ఒక ప్రత్యేక రైలు (06571) నడుస్తుంది. ఇది ఏప్రిల్ 7 నుంచి జూలై 14 వరకు ప్రతి మంగళవారం ఉదయం 7:00 గంటలకు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5:00 గంటలకు విజయనగరం చేరుతుంది. అక్కడి నుంచి కతిహార్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఏప్రిల్ 10 నుంచి జూలై 17 వరకు ప్రతి శుక్రవారం బయలుదేరి, ఆదివారం ఉదయం యశ్వంత్‌పూర్ చేరుతుంది. ఈ రైలు మొత్తం 15 ట్రిప్పులు నడుస్తుంది.

సమ్మర్ ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా..

ఈ ప్రత్యేక రైళ్లు వేసవిలో పెరిగే రద్దీని తగ్గించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ముందుగానే షెడ్యూల్ తెలుసుకుని టికెట్లు బుక్ చేసుకుంటే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు సూచించారు. ముఖ్యంగా విశాఖపట్నం, భువనేశ్వర్ ప్రాంతాల నుంచి ప్రయాణించే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

Read Also: ఆ స్పెషల్ రైళ్లు ఇక రెగ్యులర్ సర్వీసులు.. కాకినాడ ప్రజలకు రైల్వే గుడ్ న్యూస్!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×