E-Paper
Advertisement

Goods Train Brake Failure: గూడ్స్ రైలు బ్రేకులు ఫెయిల్.. 75 కి.మీ వేగంతో పరుగులు, చివరికి ఏం జరిగిందంటే?

Goods Train Brake Failure: గూడ్స్ రైలు బ్రేకులు ఫెయిల్.. 75 కి.మీ వేగంతో పరుగులు, చివరికి ఏం జరిగిందంటే?
Advertisement

భారతీయ రైల్వేలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తృటిలో పెనుప్రమాదం తప్పింది. పరిస్థితి ఘోర దుర్ఘటనకు కారణం అవుతుందనుకున్నా, చివరకు అంతా సజావుగా జరగడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటి? ఎందుకు రైల్వే అధికారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సి వచ్చిందంటే..

గూడ్స్ రైలు బ్రేకులు ఫెయిల్..

మహారాష్ట్రలో షాకింగ్ ఘటన జరగింది. పలాస్దారి- కర్జాత్ రైల్వే స్టేషన్ల మధ్య బ్రేకులు ఫెయిల్ కావడంతో ఓ గూడ్స్ రైలు కంట్రోల్ కోల్పోయింది. వేగం అకస్మాత్తుగా 75 కిలో మీటర్లుకు పెరిగింది.  విషయం తెలిసి రైల్వే అధికారులు భయంతో వణికిపోయారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలోకి నెటట్టివేయబడ్డారు. అయినప్పటికీ, ఆ రైలును ఆపేందుకు చాకచక్యంగా వ్యవహరించారు. రకరాలక పద్దతులను ఉపయోగించి సదరు గూడ్స్ రైలును ముంబై శివార్లలో అపేశారు. పెద్ద ప్రమాదాన్ని తప్పించారు.

అనూహ్యంగా పెరిగిన రైలు వేగం

Advertisement

వాస్తవానికి గూడ్స్ రైలు వేగం చాలా తక్కువగా ఉంటుంది. ప్యాసింజర్ రైలుతో పోల్చితే, అందులో సగం ఉంటుంది. కానీ, తాజాగా పూర్తి లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలుకు అకస్మాత్తుగా బ్రేకులు పని చేయడం మానేశాయి. లోయలు, మలుపులు ఉండటంతో రైలు వేగం ఊహించని విధంగా పెరిగింది. లోకో పైలట్లు ఎంత ప్రయత్నించినా రైలు ఆగకపోగా, మరింత వేగం పెరగడంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రైలు 75 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు వివరించారు.

Read Also: హోలీ వేళ రైల్వే గుడ్ న్యూస్, అందుబాటులోకి 1,244 స్పెషల్ రైళ్లు!

Advertisement

వెంటనే అలర్ట్ అయిన అధికారులు

ఎమర్జెన్సీ సమాచారం అందుకున్న కంట్రోల్ రూమ్ అధికారులు, వెంటనే రంగలోకి దిగారు. ఆ సమయంలో గూడ్స్ రైలుకు ఏ రైలు ఎదురుగా రాకుండా తగిన చర్యలు చేపట్టారు. సిగ్నలింగ్ వ్యవస్థను కంట్రోల్ చేశారు. ఎలాంటి పొరపాటు జరిగినా ప్రమాద తీవ్రత భారీ స్థాయిలో ఉంటుందని అంచనా వేసిన అధికారులు వెంటనే ఎర్జెన్సీని ప్రకటించారు. రైలు వేగాన్ని తగ్గించేందుకు రైల్వే ఇంజినీర్లు అన్ని పద్దతులను అమలు చేశారు. పట్టాలపై కొన్ని చోట్ల వేగాన్ని నిరోధించే సాంకేతిక అడ్డంకులను క్రియేట్ చేశారు. రైలును సజావుగా లేని ట్రాక్ ల మీదికి పంపించడం ద్వారా వేగాన్ని తగ్గేలా చేశారు. చివరకు రైలు వేగాన్ని 30 కిలో మీటర్లకు తీసుకొచ్చారు. ఆ తర్వాత నెమ్మదిగా రైలు వేగాన్ని తగ్గిస్తూ వచ్చారు. చివరకు ముంబై శివారు ప్రాంతంలో రైలును ఆపేశారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా రైలు ఆగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు. ప్రమాద సమయంలో గూడ్స్ రైల్లో 50 వ్యాగన్లు ఉన్నాయి. అటు ఈ ఘటనపై సెంట్రల్ రైల్వే దర్యాప్తుకు ఆదేశించింది.

Read Also: రైల్ వన్ యాప్‌లో రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకోవడం ఎలా? వావ్, ఇంత సులభమా!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×