E-Paper
Advertisement

Prank In Train: రైల్లో సీటు కోసం అన్నాదమ్ముల కంత్రీ ఐడియా.. చివరికి కటకటాల్లోకి..

Prank In Train: రైల్లో సీటు కోసం అన్నాదమ్ముల కంత్రీ ఐడియా.. చివరికి కటకటాల్లోకి..
Advertisement

Indian Railway:

రైలు ప్రయాణం చేయాలనుకున్న ఇద్దరు అన్నాదమ్ములకు జనరల్ బోగీలో సీటు దొరక్కపోవడంతో కోపంతో తలతిక్క ఆలోచన చేశారు. అనుకున్నదే ఆలస్యంగా అమలు చేశారు. ప్రయాణీకులందరినీ భయాందోళనకు గురి చేశారు. రైలు 40 నిమిషాలకు పైగా ఆలస్యం అయ్యేందుకు కారణం అయ్యారు. చివరకు పోలీసులు వారిద్దరినీ కటకటాల్లోకి పంపించారు. ఈ ఘటన యూపీలో జరిగింది. ఇంతకీ అసలు ఏమైందంటే..

రైల్లో బాంబు ఉందంటూ పోలీసులకు ఫోన్!

లూథియానాలో మెకానిక్‌ గా పనిచేస్తున్న దీపక్ చౌహాన్, నోయిడాలోని ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న అతడి సోదరుడు అంకిత్ తాజాగా ఢిల్లీలో అమృత్‌సర్- కతిహార్ మధ్య నడిచే అమ్రపాలి ఎక్స్‌ ప్రెస్‌ లో ఎక్కారు. జనరల్ టికెట్ తీసుకోని రైల్లోకి అడుగు పెట్టారు. అయితే, వారు కూర్చునేందుకు సీటు లభించలేదు. రైలు ఉత్తరప్రదేశ్‌ లోని ఎటావాకు చేరుకున్న సమయంలో సీటు కోసం తోటి ప్రయాణీకులతో అన్నాదమ్ములు గొడవకు దిగారు. ఎలాగైనా రైల్లోని ప్రయాణీకులను భయపెట్టడంతో పాటు సీటు పొందేందుకు దీపక్, అంకిత్ ప్లాన్ వేశారు. వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌ కు కాల్ చేసి రైలులో బాంబు ఉందని హెచ్చరించారు. వెంటనే అలర్ట్ అయిన రైల్వే పోలీసులు, బాంబు స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బందితో కలిస  కాన్పూర్ సెంట్రల్ స్టేషన్‌కు చేరుకున్నారు. రైలును ఆపివేసి  ప్రయాణీకులందరినీ కిందికి దించారు. రైల్లోని అన్ని కోచ్ లను 40 నిమిషాల పాటు చెక్ చేశారు. అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో, రైలు బయలుదేరడానికి అనుమతించారు.

ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన అన్నాదమ్ములు

Advertisement

పెద్ద సంఖ్యలో పోలీసులు రైల్వే స్టేషన్ కు చేరుకోవడంతో భయపడిన అన్నాదమ్ములు దీపక్, అంకిత్ తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశారు. వారు రైలు ఎక్కకూడదని, కాన్పూర్‌ లోని ఫెయిత్‌ ఫుల్‌ గంజ్‌ లో దాక్కోవాలని నిర్ణయించుకున్నారు. బెదిరింపు కాల్ గురించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, కాల్ చేసిన సెల్‌ ఫోన్‌ ను కనుగొనడానికి ప్రయత్నించారు. కానీ, స్విచ్ ఆఫ్ కావడంతో గుర్తించలేకపోయారు. తాజాగా ఆ ఫోన్లను ఆన్ చేయడంతో పోలీసులు వారిని గుర్తించారు. ఆ తర్వాత ఇద్దరినీ అరెస్ట్ చేశారు. అన్నాదమ్ములు ఇద్దరూ ఉత్తరప్రదేశ్‌ లోని ఘటంపూర్‌ కు చెందిన వారిగా వెల్లడించారు.

ఇద్దరికీ క్రిమినల్ రికార్డు లేకపోయినప్పటికీ..

నిజానికి అన్నాదమ్ములు అయిన దీపక్, అంకిత్ కు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని పోలీసులు వెల్లడించారు. అయినప్పటికీ, కేసు తీవ్రత దృష్ట్యా వారికి కఠిన శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. “వారి మీద గతంలో ఎలాంటి క్రిమినల్ రికార్డ్ లేదు. కానీ, ప్రస్తుత కేసు తీవ్రత దృష్ట్యా, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా వారిని విచారిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి వారికి కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది” అని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆకాంక్ష పాండే వెల్లడించారు. రైల్వే ప్రయాణీకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదన్నారు. లేదంటే తీవ్ర ఇబ్బందులుపడే అవకాశం ఉందన్నారు.

Advertisement

Read Also: ప్రయాణీకులకు అలర్ట్, 38 రైళ్ల టైమింగ్స్ మారాయి!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×