E-Paper
Advertisement

Bullet Train Project: రెడీ అయింది భారీ వంతెన.. ఇక బుల్లెట్ ట్రైన్ పరుగుకు మార్గం సిద్ధం!

Bullet Train Project: రెడీ అయింది భారీ వంతెన.. ఇక బుల్లెట్ ట్రైన్ పరుగుకు మార్గం సిద్ధం!
Advertisement

Bullet Train Project: రెడీ అయింది భారీ వంతెన.. దేశ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రయాణానికి మరింత సమీపంగా తీసుకువెళ్లే గుజరాత్‌కి చెందిన భరూచ్ ప్రాంతంలో 1,400 టన్నుల స్టీల్ బ్రిడ్జ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. మేక్ ఇన్ ఇండియా స్టీల్‌తో, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ వంతెన.. ముంబై – అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టులో కీలక మైలురాయిగా మారింది. మొత్తం 17 వంతెనలలో ఇది 8వది కావడం గమనార్హం. ఇకపై, బుల్లెట్ ట్రైన్ పరుగులు తీసేందుకు మౌలిక సదుపాయాలు దాదాపు సిద్ధమయ్యాయని చెప్పొచ్చు!

ఆ వంతెన స్పెషల్ ఏమిటంటే?
దేశ ప్రథమ హై – స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ రోజు రోజుకూ పురోగతిచూపిస్తూ, అభివృద్ధికి కొత్త చరిత్రను రాస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం గుజరాత్‌లోని భరూచ్ సమీపంలో నిర్మించిన 100 మీటర్ల పొడవైన, 1,400 టన్నుల స్టీల్ వంతెన తాజాగా పూర్తయింది. ఇది ఎలాంటి విదేశీ సాంకేతికత ఆధారంగా కాకుండా, పూర్తిగా స్వదేశీ సాంకేతికత, భారతీయ ఇంజనీర్ల ప్రతిభతో నిర్మించబడిన మేక్ ఇన్ ఇండియా విజయగాధ.

Advertisement

320 కిలో మీటర్ల వేగంతో రైలు..
ఈ వంతెనను Dedicated Freight Corridor (DFC) ట్రాక్‌లపై నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 17 వంతెనలు నిర్మించాల్సి ఉంది. ఇందులో 8వ వంతెనగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావడం ప్రాజెక్ట్ వేగాన్ని సూచిస్తోంది. భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్ ఈ వంతెనపై 320 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తనుంది.

ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి National High-Speed Rail Corporation Limited (NHSRCL) చేపట్టిన చర్యలు, ప్రణాళికలు ప్రత్యేక శ్రద్ధకి గురయ్యాయి. భారీ స్టీల్ బీమ్‌లు, అధునాతన లింకులు, ప్రీమియం నాణ్యత కలిగిన మౌలిక నిర్మాణాలతో ఇది రూపొందించబడింది. దేశంలోని వందల మంది ఇంజనీర్లు, శ్రామికులు, నిపుణుల కృషి ఈ వంతెన వెనుక ఉంది.

Advertisement

వంతెన నిర్మాణం సాధారణమైన పని కాదని, అది ఒక సాంకేతిక సవాలుగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే, ఇది Freight Corridor పై ఉండటంతో, టెస్ట్‌లు, బరువు పరీక్షలు అన్నీ అత్యంత ఖచ్చితంగా నిర్వహించాల్సి వచ్చింది. అంతేకాదు, భవిష్యత్‌లో బుల్లెట్ ట్రైన్ వేగంగా ప్రయాణించాల్సిన కారణంగా, ఈ బ్రిడ్జ్ అత్యంత బలమైన డిజైన్‌తో రూపొందించబడింది.

టన్నెల్స్ రెడీ..
ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు దేశవ్యాప్తంగా ఎంతో ఊహాజనితంగా చర్చించబడిన బుల్లెట్ ట్రైన్ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతున్న దశకు వచ్చింది. ఇప్పటికే అనేక టన్నెల్స్, బ్రిడ్జులు, పిలర్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇటు మహారాష్ట్రలోను, అటు గుజరాత్‌లోను పనులు వేగంగా సాగుతున్నాయి.

Also Read: Visakhapatnam Railway Station: విశాఖ రైల్వే స్టేషన్ వెళుతున్నారా? వెళ్లే దారిలో బిగ్ ట్విస్ట్.. తెలుసుకోండి!

ఇప్పటి వరకూ గుజరాత్ రాష్ట్రంలో ఈ హైస్పీడ్ రైలు మార్గానికి సంబంధించి దాదాపు 280 కిలోమీటర్ల దూరం మేర ట్రాక్ పనులు పూర్తి అయ్యాయి. ఇందులో భాగంగా అనేక పెద్ద వంతెనలు, రైలు స్టేషన్లు కూడా అభివృద్ధి చేస్తున్నారు. NHSRCL సంస్థ ప్రతి నిర్మాణాన్ని అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేస్తుండటం విశేషం.

ఈ ప్రాజెక్ట్ కేవలం ప్రయాణ వేగానికే పరిమితం కాకుండా, దేశ ఆర్థిక శక్తిని పెంపొందించడంలోనూ పాత్ర పోషించనుంది. ప్రయాణ సమయాన్ని ఘనంగా తగ్గించడమే కాదు, వాణిజ్య కార్యకలాపాల వేగాన్ని కూడా పెంచనుంది. ఉదాహరణకు, ముంబై నుంచి అహ్మదాబాద్‌కు సాధారణ రైలు ప్రయాణం ప్రస్తుతం 6-7 గంటలు పడుతుండగా, బుల్లెట్ ట్రైన్ వచ్చిన తర్వాత అదే దూరాన్ని కేవలం 2-3 గంటల్లో చేరగలుగుతారు.

భరూచ్ వంతెన పూర్తయిన నేపథ్యంలో ప్రజల ఉత్కంఠ మరింత పెరిగింది. బుల్లెట్ ట్రైన్ పట్టాలపై పరిగెత్తే రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వంతెన దేశీయ నిర్మాణ రంగానికి, ఇంజనీరింగ్ ప్రపంచానికి గర్వకారణంగా నిలిచింది.

ఇదంతా చూస్తే స్పష్టమవుతోంది.. దేశ అభివృద్ధికి వేగం పెరిగింది. ముంబై – అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కేవలం ఓ ట్రాన్స్‌పోర్ట్ మార్గం మాత్రమే కాదు, ఇది భారత టెక్నాలజీ, స్థానిక సామర్థ్యం, ఆత్మనిర్భర్ ఇండియా ప్రయాణానికి నిదర్శనం. ఈ వంతెన పూర్తయిన తర్వాత దేశ ప్రజలు గర్వంతో అనుకుంటున్నారు.. ఇక బుల్లెట్ ట్రైన్ రావడం టైమ్ మాత్రమే!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×