E-Paper
Advertisement

ఎయిర్‌పోర్ట్‌లో లగేజీ ఎక్కడకి వస్తుందో వాట్సాప్‌లో చూసుకోండి.. జజీరా కొత్త ప్లాన్!

ఎయిర్‌పోర్ట్‌లో లగేజీ ఎక్కడకి వస్తుందో వాట్సాప్‌లో చూసుకోండి.. జజీరా కొత్త ప్లాన్!
Advertisement

Jazeera Airways: కువైట్‌కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ‘జజీరా ఎయిర్‌వేస్’ మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక విమాన సర్వీసును నిర్వహించింది. కువైట్-మంగళూరు-కువైట్ సెక్టార్‌లో భాగంగా దమ్మమ్ మీదుగా ఈ ప్రయాణం సాగింది. గురువారం సాయంత్రం 4:25 గంటలకు దమ్మమ్ నుండి వచ్చిన జజీరా విమానం (J9 3417) మంగళూరులో ల్యాండ్ అయ్యింది. ఇందులో 11 మంది చిన్నారులతో సహా మొత్తం 181 మంది ప్రయాణికులు ఉన్నారు. కెప్టెన్ జిమ్మీ మూసా నేతృత్వంలోని నలుగురు సిబ్బంది ఈ విమానంలో సేవలందించారు.

జజీరా ఎయిర్‌వేస్ కొత్త ఏర్పాట్లు

Advertisement

తిరిగి ప్రయాణంలో (J9 3418) అదే రోజు సాయంత్రం 6:10 గంటలకు 151 మంది ప్రయాణికులతో ఈ విమానం మంగళూరు నుంచి బయలుదేరింది. కువైట్ , దమ్మమ్ మధ్య ప్రయాణికుల సౌకర్యార్థం ఎయిర్‌లైన్స్ ప్రత్యేకంగా రోడ్డు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. గతంలో కోవిడ్-19 సమయంలో కూడా జజీరా ఎయిర్‌వేస్ మంగళూరుకు తన సేవలను అందించిన సంగతి తెలిసిందే.

ప్రయాణికుల కోసం జాజ్‌లింక్

Advertisement

ప్రయాణికుల సమాచారం కోసం ‘జాజ్‌లింక్’ (JazLink)
కేవలం విమాన సర్వీసులే కాకుండా, ప్రయాణికులకు మెరుగైన అనుభూతిని అందించడానికి జజీరా ఎయిర్‌వేస్ టెక్నాలజీ పరంగా కీలక అడుగు వేసింది. ఇందుకోసం భారతదేశపు అగ్రగామి ‘కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆటోమేషన్’ కంపెనీతో జతకట్టి ‘జాజ్‌లింక్’ (JazLink) అనే ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది.

ఈ కొత్త టెక్నాలజీతో కలిగే ప్రయోజనాలు

ఫ్లైట్ స్టేటస్, లగేజీ వివరాలు, రీ-బుకింగ్ లింక్స్ వంటి సమాచారాన్ని ప్రయాణికులు తమ వాట్సాప్ ద్వారా నేరుగా పొందవచ్చు. వివిధ భాషల్లో సమాచారాన్ని అందించడం ద్వారా ప్రయాణికులకు భాషా ఇబ్బందులు లేకుండా చేస్తుంది. గల్ఫ్ దేశాలలోనే (GCC) మొదటిసారిగా విమానం దిగగానే మీ లగేజీ ఏ బెల్టు పైకి వస్తుందో ఆటోమేటెడ్‌గా మెసేజ్ పంపే సౌకర్యాన్ని జజీరా ప్రవేశపెట్టింది. దీనివల్ల విమానాశ్రయాల్లో ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది.

డూప్లికేట్ మెసేజ్‌లకు గుడ్‌బై

ఫోనాన్ (Phonon) వారి ’22North’ నో-కోడ్ డిజైనర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా నోటిఫికేషన్ల సామర్థ్యం 73 శాతం పెరిగినట్లు సంస్థ వెల్లడించింది. దీనివల్ల ప్రయాణికులకు అనవసరమైన డూప్లికేట్ మెసేజ్‌లు రాకుండా, ఖచ్చితమైన , అవసరమైన సమాచారం మాత్రమే అందుతుంది. తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణాన్ని అందించే జజీరా ఎయిర్‌వేస్, ఇప్పుడు టెక్నాలజీ సహాయంతో ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తోంది.

Also Read: మళ్లీ కనిపిస్తామో లేదో తెలీదు.. విమానం ఎక్కాలంటే వణికిపోతున్న పైలట్లు

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×