E-Paper
Advertisement

IRCTC Tour Package: మాతా వైష్ణోదేవిని దర్శించుకోవాలనుందా? అయితే, మీకో గుడ్ న్యూస్!

IRCTC Tour Package: మాతా వైష్ణోదేవిని దర్శించుకోవాలనుందా? అయితే, మీకో గుడ్ న్యూస్!
Advertisement

IRCTC Mata Vaishnodevi Tour Package:

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మాతా వైష్ణోదేవిని దర్శించుకోవాలనుకునే పర్యాటకుల కోసం  ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ ఖర్యులో సౌకర్యవంతంగా వెళ్లే అవకాశం కల్పిస్తుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి పూర్తి వివరాలను IRCTC సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ప్రయాణం ఢిల్లీ నుండి ప్రారంభమవుతుంది. పర్యాటకులు వారి అవసరాలకు అనుగుణంగా వివిధ ఎంపికలను అందిస్తుంది.

టూర్ ప్యాకేజీ ఆప్షన్స్, ఛార్జీ వివరాలు

ప్రయాణికులకు రెండు ప్రధాన ఎంపికలు అందబాటులో ఉంచినట్లు IRCTC వెల్లడించింది.

Advertisement

⦿ 4 పగళ్లు/3 రాత్రుల ప్లాన్: ఈ ప్యాకేజీలో ఒక్కొక్కరికి రూ.6,990 నుంచి రూ. 8,420 వరకు ఉంటాయి.

⦿ వందే భారత్ ప్రత్యేక ప్యాకేజీ (2 పగళ్ళు/1 రాత్రి): ఈ ప్యాకేజీలో ఒక్కొక్కరికి ఛార్జ్ రూ. 7,360 నుంచి ప్రారంభం అవుతుంది. ప్రయాణికులు వారి సౌలభ్యం ప్రకారం వారి ప్రయాణాలను ప్లాన్ చేసుకోవచ్చు.

MATA VAISHNODEVI EX DELHI ప్యాకేజీ వివరాలు

Advertisement

ఆదివారం నుంచి గురువారం వరకు ప్రయాణానికి వర్తించే 4-రోజులు, 3-రాత్రి ప్యాకేజీ (MATA VAISHNODEVI EX DELHI – WEEKDAY) IRCTC ఛార్జీల వివరాలను కూడా ప్రకటించింది.

⦿ క్లాస్ ఆక్యుపెన్సీ ఛార్జీ (ఒక్కొక్కరికి)

కంఫర్ట్ క్లాస్ (3AC)

ట్రిపుల్ ఆక్యుపెన్సీ-  6,990

డబుల్ ఆక్యుపెన్సీ- రూ.8,100

సింగిల్ ఆక్యుపెన్సీ- రూ.10,770

పిల్లవాడు (5-11 సంవత్సరాలు, బెడ్‌తో)- రూ.6,320

పిల్లవాడు (5-11 సంవత్సరాలు, బెడ్ లేకుండా)- రూ.5,255

⦿ సుపీరియర్ క్లాస్ (2AC)

ట్రిపుల్ ఆక్యుపెన్సీ- రూ.8,220

డబుల్ ఆక్యుపెన్సీ- 9,330

సింగిల్ ఆక్యుపెన్సీ- రూ.11,995

పిల్లవాడు (5-11 సంవత్సరాలు, బెడ్‌తో)- రూ.7,550

పిల్లవాడు (5-11 సంవత్సరాలు, బెడ్‌ లేకుండా)- రూ.6,485

టూర్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి?

పర్యాటకులు తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని బుక్ చేసుకోవడానికి IRCTC అధికారిక వెబ్ సైట్ ను చూడాలని కోరింది.  ప్రయాణికులు తమ సౌలభ్యం ప్రకారం యాత్రను ప్లాన్ చేసుకోవడానికి, బుక్ చేసుకోవడానికి మరింత సమాచారం కోసం IRCTC అధికారిక వెబ్‌ సైట్‌ ను చూడాలని చెప్పింది. మాతా వైష్ణోదేవి యాత్రకు సంబంధించిన ఇతర టూర్ ప్యాకేజీల గురించి పూర్తి వివరాలను రైల్వే టికెట్ బుకింగ్ కేంద్రాల దగ్గర తెలుసుకోవచ్చన్నారు రైల్వే అధికారులు.

Read Also:  నల్ల రంగులో వందే భారత్.. బీజేపీ మంత్రి ట్వీట్ చూసి అంతా షాక్, అసలు విషయం ఏమిటంటే?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×