E-Paper
Advertisement

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!
Advertisement

Affordable Stay at Railway Stations: తరచుగా రైల్వే స్టేషన్ కు వెళ్లిన తర్వాత ట్రైన్ ఆలస్యం అనే మాట వింటుంటాం. అలాంటి సమయంలో ప్లాట్ ఫారమ్ మీదే గంటల తరబడి వెయిట్ చేయాల్సి రావచ్చు. చాలా మంది  రైలు కోసం గంటల తరబడి స్టేషన్‌ లో వేచి ఉండాల్సి వచ్చిన సందర్భాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ప్లాట్‌ ఫారమ్‌ మీద  కూర్చోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రైలు ఆలస్యం అయితే  ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. అయితే, చాలా మంది ప్రయాణికులకు తెలియని ఓ ఉపయోగకరమైన సదుపాయం భారతీయ రైల్వే అందిస్తోంది. అదే ఐఆర్‌సీటీసీ రిటైరింగ్ రూమ్స్.

ఇంతకీ ఐఆర్‌సీటీసీ రిటైరింగ్ రూమ్స్ అంటే ఏంటి?

రిటైరింగ్ రూమ్స్ అనేవి రైల్వే స్టేషన్లలోనే అందుబాటులో ఉంటాయి. ఈ గదులను ప్రయాణికులు తక్కువ ఖర్చుతో బుక్ చేసుకుని రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. రైలు ప్రయాణం చేసే వారికి ఇది ఎంతో ఉపయోగపడే సౌకర్యం. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ప్రయాణించే వారు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నవారికి ఈ సదుపాయం మరింత సౌకర్యంగా ఉంటుంది.

జస్ట్ రూ. 200కే ఏసీ రూమ్

Advertisement

రిటైరింగ్ రూమ్స్‌ లో సాధారణ గదులతో పాటు ఏసీ గదులు, డార్మిటరీలు కూడా అందుబాటులో ఉంటాయి. డార్మిటరీ బెడ్స్ సాధారణంగా రూ.100 నుంచి ప్రారంభమవుతాయి. అలాగే , గదులు సుమారు రూ.200 నుంచి లభిస్తాయి. స్టేషన్, రూమ్ మోడల్, డిమాండ్‌ ను బట్టి ధరల్లో కొంత మార్పు ఉంటుంది.

12 గంటల నుంచి 2 రోజుల వరకు బుక్ చేసుకోచ్చు!

ఈ గదులను 12 గంటల నుంచి గరిష్టంగా రెండు రోజుల వరకు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కన్ఫర్మ్ అయిన టికెట్, ఆర్‌ఏసీ టికెట్ ఉన్న ప్రయాణికులు మాత్రమే ఈ సదుపాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌ సైట్, యాప్ ద్వారా సులభంగా ఆన్‌ లైన్‌ లో బుకింగ్ చేసుకోవచ్చు. రాత్రి సమయంలో రైలు ఆలస్యం అయినా, తెల్లవారుజామున రైలు ఉన్నా, మధ్యలో కొన్ని గంటలు విశ్రాంతి అవసరమైనా ఈ గదులు బుక్ చేసుకోవడం మంచిది. స్టేషన్ బయట హోటల్ కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. అలాగే అదనపు ఖర్చు కూడా తగ్గుతుంది.

Advertisement

వాస్తవానికి చాలా మంది ప్రయాణికులు ఈ సదుపాయం గురించి తెలియక ప్లాట్‌ ఫారమ్‌ పై గంటల తరబడి వేచి ఉంటారు. కానీ, ముందుగానే రిటైరింగ్ రూమ్ బుక్ చేసుకుంటే సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎండాకాలంలో, ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితుల్లో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్లే రైలు ఆలస్యం అయినప్పుడు, స్టేషన్‌లో ఎక్కువ సమయం గడపాల్సి వచ్చినప్పుడు ప్లాట్‌ ఫారమ్‌ మీద ఇబ్బంది పడకుండా రైల్వే రిటైరింగ్ రూమ్స్‌ ను వాడుకోవడం మంచిది. తక్కువ ఖర్చుతో మంచి సౌకర్యాన్ని పొందుతూ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు.

Read Also: కన్ఫర్మ్ టిక్కెట్ ఉన్నా నో సీట్.. రైల్వేకు దిమ్మతిరిగే షాకిచ్చిన వినియోగదారుల కమిషన్!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×