E-Paper
Advertisement

బౌద్ధ ఆలయాల దర్శనం, ఏకంగా 20 శాతం డిస్కౌంట్ ప్రకటించిన IRCTC!

బౌద్ధ ఆలయాల దర్శనం, ఏకంగా 20 శాతం డిస్కౌంట్ ప్రకటించిన IRCTC!
Advertisement

IRCTC Launches Discounted Buddhist Circuit Train: ప్రముఖ పర్యాటక సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణికులకు మరో క్రేజీ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బౌద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించుకునే వారికి చక్కటి అవకాశం కల్పిస్తోంది.  IRCTC స్పెషల్  బౌద్ధ టూరిస్ట్ రైలు ప్యాకేజీపై ఏకంగా 20% తగ్గింపు ప్రకటించింది. ఈ ఆఫర్ తో తక్కువ ధరలో బౌద్ధ క్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది.

7 రాత్రులు, 8 రోజుల యాత్ర

ఇక ఈ ప్రత్యేక టూర్ మొత్తం 7 రాత్రులు, 8 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ యాత్ర ప్రారంభం సఫ్దర్‌ జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ట్రిప్‌ లో గౌతమ బుద్ధుని జీవితానికి సంబంధించిన ముఖ్యమైన పవిత్ర ప్రాంతాలను  సందర్శించేలా ప్లాన్ చేశారు. మొదటగా బోధ్ గయా వెళ్తారు. బుద్ధుడు బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొందిన ప్రదేశం కావడంతో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది.

Advertisement

ఆ తర్వాత నలందా, రాజ్ గిర్ ప్రాంతాలను సందర్శిస్తారు. నలంద విశ్వవిద్యాలయం ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాత విద్యాకేంద్రంగా నిలిచింది. ఆ తర్వాత ఈ యాత్ర వారణాసికి వెళ్తుంది. అక్కడ సారనాథ్ కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడే బుద్ధుడు తన మొదటి ఉపదేశం ఇచ్చారు. అనంతరం  బుద్ధుని జన్మస్థలం లుంబిని, మహాపరినిర్వాణ స్థలం కుషినగర్, శ్రావస్తి లాంటి ప్రదేశాలను కూడా సందర్శిస్తారు. ఈ అన్ని ప్రదేశాలు బౌద్ధమతానికి ఎంతో కీలకమైన క్షేత్రాలుగా గుర్తింపు పొందాయి. ఈ యాత్రలో భాగంగా చివరలో తాజ్ మహల్ సందర్శనను కూడా చేర్చారు.

డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలులో యాత్ర

ప్రయాణం పూర్తిగా డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలులోనే జరుగుతుంది. ఈ రైలు ఆధునిక సౌకర్యాలతో కూడి ఉంటుంది. ఇందులో 12 LHB కోచ్‌లు ఉంటాయి. ప్రయాణికులు తమ అవసరాలకు అనుగుణంగా AC ఫస్ట్ క్లాస్, AC టూ టైర్ ను సెలక్ట్ చేసుకోవచ్చు. AC 1లో విశాలమైన క్యాబిన్లు, కూపేలు, వ్యక్తిగత లాకర్లు లాంటి సౌకర్యాలు ఉంటాయి.

ఒకేసారి 60 మంది భోజనం చేసే అవకాశం

Advertisement

రైలులో భోజనానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. రెండు డైనింగ్ కార్లు ఉండి, ఒక్కో కారులో 60కి పైగా ప్రయాణికులు ఒకేసారి కూర్చొని భోజనం చేయవచ్చు.దేశీ, విదేశీ వంటకాలు కూడా అందిస్తారు. ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉంది.

20 శాతం డిస్కౌంట్

ఈ పర్యటనను అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో IRCTC  డిస్కౌంట్‌ను ప్రకటించింది. ట్విన్ షేరింగ్ పద్ధతిలో ఒక్కో వ్యక్తికి ప్రారంభ ధరను సుమారు రూ. 76,905కు తగ్గించారు. పెద్ద స్థాయిలో సౌకర్యాలు, పర్యటన ప్రదేశాలు, భోజనం, వసతి అన్నీ కలిపి చూస్తే చీప్ అండ్ బెస్ట్ టూర్ ప్యాకేజీగా చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికత ప్రయాణాన్ని కోరుకునే వారికి ఈ బౌద్ధ టూర్ ఓ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: మిస్సైన 37 ఏళ్లకు తిరిగొచ్చిన విమానం, ఇప్పటికీ అంతు చిక్కని పాన్ ఆమ్ 914 ఫ్లైట్ మిస్టరీ!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×