E-Paper
Advertisement

IRCTC – Aadhaar: కేవలం ఆధార్ లింక్ కలిగిన IRCTC యూజర్లకే తత్కాల్ టికెట్‌లో ప్రాధాన్యం?

IRCTC – Aadhaar: కేవలం ఆధార్ లింక్ కలిగిన IRCTC యూజర్లకే తత్కాల్ టికెట్‌లో ప్రాధాన్యం?
Advertisement

IRCTC – Aadhaar: టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కీలక చర్యలు చేపడుతోంది. నిజమైన ప్రయాణీకులే టికెట్లు బుక్ చేసుకునే జాగ్రత్తలు తీసుకుంటుంది. జూలై 1 నుంచి  తత్కాల్ రైలు టికెట్ బుకింగ్స్ కు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. తాజాగా తత్కాల్ బుకింగ్స్ కు సంబంధించి పార్లమెంట్ లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు.

ఆధార్‌ తో లింక్ చేయబడిన IRCTC వినియోగదారులకు ప్రాధాన్యత

Advertisement

తాజా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో, 11 మంది రాజ్యసభ రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థ గురించి పలు ప్రశ్నలు అడిగారు.  “తత్కాల్ టికెట్ బుకింగ్‌లకు ఆధార్ ఆధారిత ప్రామాణీకరణ తప్పనిసరి అవుతుందా?  ఆధార్-లింక్డ్ IRCTC ఖాతాలు ఉన్న ప్రయాణీకులకు బుకింగ్ లో ప్రాధాన్యత లభిస్తుందా? అనే అంశాలపై వివరణ కోరారు. ఏజెంట్లు, టౌట్‌ లు తత్కాల్ టికెట్లను దుర్వినియోగం చేయడాన్ని అరికట్టడానికి ఈ చర్యలు ఎలా సహాయపడతాయి?” అనే ప్రశ్నలు వేశారు.

సభ్యుల ప్రశ్నలకు మంత్రి వైష్ణవ్ పూర్తి వివరాలు వెల్లడించారు. ఆగస్టు 1 నుంచి కొత్త తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు. తత్కాల్ పథకం కింద టికెట్లను ఆధార్ ప్రామాణీకరించిన వినియోగదారులు మాత్రమే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) యాప్, వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని అన్నారు. తత్కాల్ బుకింగ్ ARP తొలి 30 నిమిషాలలో ఏజెంట్లు టిక్కెట్లు బుక్ చేసుకోకుండా నిషేధించబడ్డారని ఆయన వెల్లడించారు. తాజా నిర్ణయాలతో  నకిలీ ఖాతాలను ఉపయోగించి ఎక్కువ బుకింగ్‌లకు పాల్పడే వారికి అడ్డుకట్ట వేసినట్లు తెలిపారు. వివిధ ప్లాట్‌ ఫామ్‌ లలో వచ్చిన అభిప్రాయాల ఆధారంగా తత్కాల్ టికెట్ల బుకింగ్‌ లో పారదర్శకతను నిర్ధారించడానికి చర్యలు తీసుకునే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని మంత్రి సమాధానమిచ్చారు.

Advertisement

ఇండియన్ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ టైమింగ్స్

తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం భారతీయ రైల్వే ప్రయాణానికి ఒకరోజు ముందు అవకాశాన్ని కల్పిస్తోంది. సవరించిన నిబంధనల ప్రకారం, AC తరగతులకు  ఉదయం 10:00 నుండి 10:30 వరకు బుక్ చేసుకునే అవకాశం ఉంది. నాన్ ఏసీ తరగతులకు ఉదయం 11 నుండి 11:30 వరకు అవకాశం కల్పిస్తుంది.

Read Also: భారత్ లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ వెరీ వెరీ స్పెషల్, ఎందుకో తెలుసా?

తత్కాల్ టికెట్ బుకింగ్ కు ఓటీపీ తప్పనిసరి

కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) కౌంటర్లలో,  అధీకృత ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకున్న తత్కాల్ టికెట్లకు బుకింగ్ సమయంలో వినియోగదారు అందించిన మొబైల్ నంబర్‌కు OTP ప్రామాణీకరణ పంపడం కచ్చితంగా అవసరం అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Read Also: ప్రపంచంలో భయంకరమైన రైల్వే స్టేషన్లు, ధైర్యం ఉంటేనే వెళ్లండి బాస్!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×