E-Paper
Advertisement

Free Train Journey: టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ చెయ్యొచ్చు.. వారు మాత్రమే సుమా!

Free Train Journey: టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ చెయ్యొచ్చు.. వారు మాత్రమే సుమా!
Advertisement

Travel In Train Without Ticket: ఇండియన్ రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే ‘మిలీనియం గిఫ్ట్’ అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద ఉచిత నెలవారీ సీజన్ టికెట్లు అందించనుంది. ఈ పాస్ లను విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టూడెంట్స్ తమ నివాస స్థలం, స్కూల్ మధ్య ప్రయాణించడానికి ఈ పాస్ లను అందించనుంది. విద్యార్థులకు రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా ఎడ్యుకేషన్ కు సపోర్టు చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

‘మిలీనియం గిఫ్ట్’ స్కీమ్ కు అర్హులు ఎవరంటే?

Advertisement

10వ తరగతి వరకు బాలురకు ఈ పథకం ద్వారా ఉచిత పాస్ అందిస్తారు. ఇక బాలికల విషయానికి వస్తే, 12వ తరగతి వరకు చదివే వాళ్లకు అందిస్తారు. ఇది వారి నివాసం, పాఠశాలకు మధ్య ప్రయాణించేందుకు ఉపయోగపడుతుంది.

ఉచిత టికెట్ గురించి..

Advertisement

ఈ పథకం కింద నెలవారీ సీజన్ టికెట్లు మాత్రమే జారీ చేయబడతాయి. త్రైమాసిక సీజన్ టికెట్లు అందించబడవు. ఈ పాస్ కేవలం సెకెండ్ క్లాస్ లో ప్రయాణించడానికే ఉపయోగపడుతుంది.  గరిష్ట దూరం 150 కి.మీ వరకు కవర్ చేస్తుంది. సూపర్‌ఫాస్ట్ రైళ్లతో సహా మెయిల్/ఎక్స్‌ ప్రెస్ రైళ్లలో ఈ పాస్ తో ప్రయాణించడం కుదరదు. ముంబైలోని కొన్ని ప్రాంతాలలో CIDCO సర్‌ ఛార్జ్ లాంటి అదనపు ఛార్జ్‌లు విధించబడవు. విద్యార్థులు తమ పాఠశాల, కళాశాల నుంచి బోన ఫైడ్ సర్టిఫికేట్ అందించాల్సి ఉంటుంది. ఈ పథకం విద్యార్థులకు రాయితీ MSTల మాదిరిగానే షరతులకు లోబడి ఉంటుంది. ఈ టికెట్లపై రైల్వేస్ నుంచి మిలీనియం గిఫ్ట్ అనే స్కీమ్ అనే సీల్ వేసి ఉంటుంది.

ఈ పాస్ లు ఎందుకు ప్రవేశ పెట్టారంటే?

ఈ పాస్ లు ముఖ్యంగా గ్రామీణ, శివారు ప్రాంతాలలోని విద్యార్థులకు సరసమైన ప్రయాణాన్ని అందిస్తాయి. అదే సమయంలో విద్యను ప్రోత్సహించడానికి సాయపడుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ పథకం భారతీయ రైల్వే విద్యార్థులకు రాయితీలను అందించడానికి చేస్తున్న విస్తృత ప్రయత్నాలలో భాగం. ఇందులో జనరల్, SC/ST కేటగిరీ విద్యార్థులకు స్వస్థల ప్రయాణం, విద్యా పర్యటనలు, ప్రవేశ పరీక్షలకు రాయితీ ఛార్జీలు కూడా ఉన్నాయి.  జనరల్ కేటగిరీ విద్యార్థులు స్వస్థలం, విద్యా పర్యటనలకు 2వ, స్లీపర్ క్లాస్‌ లో  50% రాయితీతో వెళ్లే అవకాశం ఉంటుంది. SC/ST కేటగిరీ విద్యార్థులకు 75% రాయితీ లభిస్తుంది.

ఈ పాస్ పొందాలంటే ఎలా?

విద్యార్థులు సమీపంలోని రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్‌ లో దరఖాస్తు చేసుకోవాలి. చెల్లుబాటు అయ్యే  ID ప్రూఫ్, చదువుతున్న స్కూల్, కాలేజీ నుంచి బోనాఫైడ్ సర్టిఫికేట్ అందించాలి. ఆ తర్వాత MST అనేది ప్రయాణీకుల పేరు, వయస్సు, స్టేషన్లు, తరగతి, చెల్లుబాటు అయ్యే వివరాలను కలిగి ఉన్న ప్లాస్టిక్-కోటెడ్ కార్డ్‌ గా జారీ చేయబడుతుంది.  ప్రయాణ సమయంలో చెకింగ్ అధికారులకు ఈ పాస్ ను చూపించాల్సి ఉంటుంది.

Read Also: 180 ఏళ్లు నడిచిన రాయల్ రైలుకు గుడ్ బై, చివరి స్టాప్ కు చేరేది ఎప్పుడంటే?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×