E-Paper
Advertisement

Vande Bharat Express: తెలంగాణలో మరో వందేభారత్ కు హాల్టింగ్, రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్!

Vande Bharat Express: తెలంగాణలో మరో వందేభారత్ కు హాల్టింగ్, రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్!
Advertisement

Indian Railways: రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా మంచిర్యాలలో వందేభారత్ రైలు ఆగాలని కోరుకుంటున్న ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రైల్వే శాఖ అధికారిక ప్రకటన చేసింది. కేంద్రం నిర్ణయం పట్ల ఆ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా ఈ ప్రాంత ప్రజల డిమాండ్ మేరకు ప్రజా ప్రతినిధులు రైల్వేశాఖ అధికారులు, మంత్రికి విజ్ఞాపనలు చేశారు. తమ ప్రాంత ప్రజల డిమాండ్ ను వివరించారు. ఈ ప్రాంత ప్రజల కోరికను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే హాల్టింగ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.

రైల్వే మంత్రికి మంచిర్యాల నాయకుల విజ్ఞప్తి

Advertisement

సికింద్రాబాద్‌– నాగ్‌ పూర్‌ మధ్య నడుస్తున్న వందే భారత్‌ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్‌ ఇవ్వాలని ఎంపీ వంశీతో పాటు జిల్లా బీజేపీ నాయకులు కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు రైల్వే సహాయ మంత్రి వి.సోమన్నను కోరారు. సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో ఆదాయపరంగా మంచిర్యాల రైల్వే స్టేషన్‌ నాన్‌ సబర్బన్‌ గ్రేడ్‌ రైల్వే స్టేషన్‌ జాబితాలో 30వ స్థానంలో ఉందని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఒక్క రైల్వే స్టేషన్‌ లో కూడా వందే భారత్‌ హాల్టింగ్‌ లేదన్నారు.   రామగుండం, మంచిర్యాల రైల్వే స్టేషన్ల మధ్య దూరం తక్కువగా ఉందని, మంచిర్యాల స్టేషన్‌ లో వందేభారత్ ను ఆపాలని కోరారు. మంచిర్యాల రైల్వే స్టేషన్‌ నుంచి రోజూ చాలా మంది వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు హైదరాబాద్‌, నాగ్‌ పూర్‌ వెళ్తుంటారని చెప్పారు. మంచిర్యాలలో రైలు నిలిపితే రైల్వే సంస్థకు అధిక ఆదాయం వస్తుందని, అదే సమయంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందన్నారు. అటు మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల నుంచి ప్రతి ఏటా వేలాది మంది భక్తులు తిరుపతికి వెళ్తుంటారని, మంచిర్యా ల నుంచి తిరుపతికి రైలును నడపాలని కోరారు.

Read Also:  ఇండియాలో ఇప్పటికీ ఆ రైల్వే లైన్ బ్రిటిషర్లదేనట, ఏటా రాయల్టీ కూడా కట్టించుకుంటున్నారు!

Advertisement

మంచిర్యాల ప్రజల సంతోషం

మంచిర్యాలలో వందే భారత్ ట్రైన్‎కు హాల్టింగ్ ఇవ్వడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు తమ కోరికను పట్టించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా వందేభారత్ రైలుకు హాల్టింగ్ ఇవ్వడం పట్ల కేంద్రానికి కృతజ్ఞతలు చెప్తున్నారు. మంచిర్యాలలో త్వరలోనే వందే భారత్ ట్రైన్ ఆగుతుందన్నారు. సికింద్రాబాద్-నాగ్ ‎పూర్ వందే భారత్ ట్రైన్ హాల్టింగ్ ఉంటుందని చెప్పారు. ఏడాదిన్నరగా చేస్తున్న కృషికి కేంద్రం స్పందించి సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Read Also: 7 రూట్లలో రెట్టింపు కాబోతున్న వందేభారత్ కోచ్ లు, ఇదీ క్రేజీ న్యూస్ అంటే!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×