E-Paper
Advertisement

Indian Railways: 2 వేల కొత్త రైళ్లు, ప్రయాణీకులందరికీ బెర్తులు.. ఇండియన్ రైల్వే ప్లాన్స్ అదుర్స్ అంతే!

Indian Railways: 2 వేల కొత్త రైళ్లు, ప్రయాణీకులందరికీ బెర్తులు.. ఇండియన్ రైల్వే ప్లాన్స్ అదుర్స్ అంతే!
Advertisement

Indian Railways: రాబోయే నాలుగు సంవత్సరాల్లో భారతీయ రైల్వే కీలక ప్రణాళికలు అమలు చేయబోతోంది. ఏకంగా 2 వేల కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. వీటి ద్వారా రైల్వే ప్రయాణ వ్యవస్థను మరింత అప్ డేట్ చేయబోతోంది. ఈ రైళ్ల రాకతో ప్రయాణీకులందరికీ కన్ఫర్మ్ బెర్త్ లు లభించనున్నాయి. అత్యంత సవాలుగా మారిన వెయిట్ లిస్ట్ టికెట్లను సమస్యను పూర్తి తొలగిపోనుంది.

ప్రతి ఏటా 1,000 కోట్ల మందికి ప్రయాణ సౌకర్యం

Advertisement

రైల్వే తాజా ప్రణాళిక ప్రకారం ప్రతి ఏటా 1,000 కోట్ల మందికి  మెరుగైన ప్రయాణ వసతిని కల్పించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ప్రస్తుత వార్షిక సంఖ్య 800 కోట్లు ఉండగా, గణనీయమైన స్థాయిలో పెరుగుదల కనిపించనుంది. రిజర్వ్డ్ కేటగిరీలలో అందుబాటులో ఉన్న బెర్త్‌ల కొరత కారణంగా ఏర్పడిన 5 కోట్ల మంది వెయిట్‌ లిస్ట్ చేయబడిన ప్రయాణీకుల ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేయనుంది. అదనపు రైళ్లను ప్రవేశపెట్టడంతో ప్రతి ప్రయాణికుడికి ధృవీకరించబడిన టికెట్ ను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది భారతీయ రైల్వే.  ప్రస్తుతం భారతీయ రైల్వే రోజుకు సుమారు 10,748 ప్యాసింజర్ రైళ్లను నడుపుతుంది. మరో 2,000 రైళ్లను చేర్చడం ద్వారా రిజర్వ్డ్ ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్ తగ్గుతుంది. అందుబాటులో ఉన్న రైళ్ల సంఖ్యను పెంచడం ద్వారా, ప్రయాణీకులకు ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలని, రిజర్వ్డ్ సీటు లేకుండా ఎవరూ ఉండకూడదని రైల్వే సంస్థ భావిస్తోంది.

రైళ్ల విస్తరణ, మౌళిక వసతుల పెంపు

Advertisement

భారతీయ రైల్వే వేగవంతమైన, ఇంధనాన్ని ఆదా చేస్తూ, ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచడానికి ఆధునిక సౌకర్యాలతో కూడిన 450 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తోంది. దీనితో పాటు, సమర్థవంతమైన, హై-స్పీడ్ సేవలను అందించడానికి రూపొందించబడిన 200 పుష్ పుల్ రైళ్లను ప్రవేశపెట్టనుంది. రైల్వే నెట్‌ వర్క్ సామర్థ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో ఈ కొత్త రైళ్లు మెయిల్, ఎక్స్‌ ప్రెస్ సేవల పెరుగుదలతో అనుబంధంగా ఉంటాయి. పెరుగుతున్న రైళ్ల సంఖ్యకు అనుగుణంగా లైన్ సామర్థ్యాన్ని పెంచుతున్నారు అధికారులు. రైళ్లు సజావుగా, వేగవంతమైన ప్రయాణాలు కొనసాగించేలా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,000 రైల్ ఓవర్ బ్రిడ్జిలు (ROBలు), రైల్ అండర్ బ్రిడ్జిలు (RUBలు) నిర్మిస్తున్నారు.

వెయిట్‌ లిస్ట్ టికెటింగ్ 25 శాతానికి పరిమితం

ఈ విధానంతో వెయిట్‌ లిస్ట్ చేయబడిన టికెట్ల జారీని పరిమితం చేస్తారు. కొత్త నియమం వెయిట్‌ లిస్ట్ చేయబడిన టికెట్ల జారీని కోచ్ మొత్తం సీటింగ్ సామర్థ్యంలో 25 శాతానికి పరిమితం చేస్తుంది. ఈ చర్య మరింత పారదర్శకంగా, న్యాయంగా ఉండే టికెటింగ్ వ్యవస్థను తయారు చేసేందుకు రూపొందించబడింది. గతంలో, పీక్ సీజన్లలో, స్లీపర్ క్లాస్‌ లో వెయిట్‌ లిస్ట్‌లు తరచుగా 300 మంది ప్రయాణికులకు మించి, AC కోచ్‌లలో 150 కంటే ఎక్కువ మంది ప్రయాణికులకు మించి ఉండేవి. వెయిట్‌ లిస్ట్‌ను 25% వద్ద క్యాప్ చేయడం ద్వారా, అందరికీ కన్ఫర్మ్ టికెట్లు దొరికే అవకాశం ఉంటుంది. ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం రిజర్వేషన్ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. ప్రయాణీకులు ధృవీకరించబడిన బెర్త్‌ను పొందే అవకాశాన్ని ముందుగానే తెలుసుకునేలా చేస్తుంది.

Read Also: వందేభారత్ స్లీపర్ కు ఎదురు దెబ్బ, ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమే!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×