E-Paper
Advertisement

Festival Special Trains: దీపావళి కోసం స్పెషల్ వందేభారత రైళ్లు, ఏ రూట్లో నడుస్తాయంటే?

Festival Special Trains: దీపావళి కోసం స్పెషల్ వందేభారత రైళ్లు, ఏ రూట్లో నడుస్తాయంటే?
Advertisement

Vande Bharat Festival Special Trains:

పండుగ సీజన్ వేళ ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా భారతీయ రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ సీజన్ కోసం మొత్తం 12 వేల ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అందులో భాగంగానే  రెండు ప్రత్యేక వందేభారత్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ రైళ్లు అక్టోబర్ 11 నుంచి నవంబర్ 17 వరకు సేవలు అందించనున్నాయి. ఈ మేరకు భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. పండుగ సీజన్ లో ప్రయాణీకులు ప్రయాణ అనుభవాన్ని సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నార్త్ రైల్వే చీఫ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ ప్రకటించారు.

స్పెషల్ వందేభారత్ రైళ్లు నడిచే రూట్లు ఇవే!

పండుగ సీజన్ లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ రెండు ప్రత్యేక రైళ్లు దేశ రాజధాని న్యూఢిల్లీ- బీహార్ రాజధాని పాట్నా మధ్య రాకపోకలు కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. రైలు నంబర్ 02251, 02252, 02253, 02254 రైళ్లు ప్రత్యామ్నాయ రోజుల్లో నడుస్తాయన్నారు.

⦿ రైలు నంబర్ 02252

Advertisement

ఈ రైలు న్యూఢిల్లీ నుంచి పాట్నా వరకు వెళ్తుంది. పండుగ సీజన్ లో మొత్తం 16 ట్రిప్పులు వేస్తుంది. ఈ రైలు ప్రతి సోమవారం, బుధవారం, శనివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు అక్టోబర్ 11 నుంచి నవంబర్ 15 వరకు నడుస్తుంది. ఉదయం 8.35 నిమిషాలకు న్యూఢిల్లీ నుంచి ఈ రైలు బయల్దేరుతుంది.  రాత్రి 9.30 గంటలకు పాట్నాకు చేరుకుంటుంది. మొత్తంగా 12 గంటల 55 నిమిషాల్లో ప్రయాణం పూర్తవుతుంది. ఈ రైలు అలీగఢ్, కాన్పూర్ సెంట్రల్, ప్రయాగ్ రాజ్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, బక్సర్, అరాలో ఆగుతుంది.

⦿ రైలు నంబర్ 02251

ఈ రైలు పాట్నా నుంచి న్యూఢిల్లీ వరకు నడుస్తుంది. అక్టోబర్ 12 నుంచి నవంబర్ 16 మధ్య ప్రతి మంగళవారం, గురువారం, ఆదివారం నడుస్తుంది. మొత్తం 16 ట్రిప్పులు వేస్తుంది. పాట్నా నుంచి ఉదయం 10 గంటలకు బయల్దేరే ఈ రైలు రాత్రి 11.30 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. మొత్తంగా 13.30 గంటల పాటు ప్రయాణిస్తుంది. ఈ రైలు అరా, బక్సర్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, ప్రయాగ్‌రాజ్,  కాన్పూర్ సెంట్రల్, అలీఘర్ లో ఆగుతుంది.

⦿ రైలు నంబర్ 02253

Advertisement

ఈ రైలు పాట్నా నుంచి న్యూఢిల్లీకి ప్రయాణిస్తుంది. ఈ రైలు అక్టోబర్ 11 నుంచి నవంబర్ 17 వరకు 17 ట్రిప్పులు వేస్తుంది.  ప్రతి సోమవారం, బుధవారం, శనివారం అందుబాటులో ఉంటుంది. పాట్నా నుంచి ఈ రైలు ఉదయం 10 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి 11.30 గంటలకు న్యూఢిల్లీకి చేరుకుంటుంది. మొత్తంగా 13 గంటల 30 నిమిషాల పాటు ప్రయాణం కొనసాగుతుంది.  అరా, బక్సర్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ సెంట్రల్, అలీగఢ్ స్టేషన్లలో ఆగుతుంది.

⦿ రైలు నంబర్ 02254

ఈ రైలు న్యూఢిల్లీ నుంచి పాట్నా వరకు నడుస్తుంది. మొత్తంగా 16 ట్రిప్పులు వేయనుంది. మంగళవారం, గురువారం, ఆదివారం అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 12 నుంచి నవంబర్ 16 వరకు నడుస్తుంది. న్యూఢిల్లీ నుంచి ఉదయం 8.35 బయల్దేరుతుంది. రాత్రి 9.30 గంటలకు పాట్నాకు చేరుకుంటుంది. ఈ రైలు మొత్తం 12 గంటల 55 నిమిషాల పాటు ప్రయాణిస్తుంది. అలీగఢ్, కాన్పూర్ సెంట్రల్, ప్రయాగ్‌రాజ్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, బక్సర్,  అరాలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లు 20 కోచ్ లతో నడవనున్నాయి.

Read Also: ఇక ఆ 10 రైళ్లు తిరుపతి నుంచి కాదు తిరుచానూరు నుంచి నడుస్తాయట, ఎందుకంటే?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×