E-Paper
Advertisement

ప్రయాణీకులకు గుడ్ న్యూస్, హైదరాబాద్ నుంచి ఆ ప్రాంతానికి 3 వీక్లీ రైళ్లు!

ప్రయాణీకులకు గుడ్ న్యూస్, హైదరాబాద్ నుంచి ఆ ప్రాంతానికి 3 వీక్లీ రైళ్లు!
Advertisement

Secunderabad–Belagavi Weekly Express Trains: తెలంగాణ, కర్ణాటయ మధ్య రైల్వే కనెక్టివిటీని పెంచేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్- బెళగావి మధ్య వీక్లీ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న మూడు సర్వీసులను, ఇప్పుడు వారానికి ఒకసారి నడిచే రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ప్రయాణికులకు సౌకర్యం పెరగడంతో పాటు, రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

వీక్లీ ఎక్స్ ప్రెస్ రైళ్లకు కొత్త నెంబర్లు కేటాయింపు

సికింద్రాబాద్–బెళగావి మధ్య నడిచే ప్రత్యేక రైలు (07335/07336)కి ఇప్పుడు కొత్త నంబర్లు కేటాయించారు. ఈ రైలు ఇకపై 17073/17074గా నడుస్తుంది. ప్రతి సోమవారం సాయంత్రం 4:30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు మంగళవారం ఉదయం 10:30 గంటలకు బెళగావి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, మంగళవారం మధ్యాహ్నం 1:00 గంటలకు బెళగావి నుంచి బయలుదేరి, బుధవారం ఉదయం సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ సర్వీస్ ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారం, వ్యక్తిగత పనుల కోసం తరచుగా ప్రయాణించే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.

Advertisement

అటు హైదరాబాద్–బెళగావి మధ్య నడిచే మరో సర్వీస్ కూడా రెగ్యులర్ వీక్లీ రైలుగా మారింది. ఈ రైలు 17071/17072 నంబర్లతో ప్రతి గురువారం హైదరాబాద్ నుంచి బయలుదేరి, శుక్రవారం ఉదయం బెళగావి చేరుకుంటుంది. అదే రోజు మధ్యాహ్నం తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ సర్వీస్ కూడా ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమయాన్ని సర్దుబాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఇక మూడవ సర్వీస్ చర్లపల్లి–బెళగావి మధ్య నడుస్తుంది. 17075/17076 నంబర్లతో ఈ రైలు ప్రతి శనివారం చర్లపల్లి నుంచి బయలుదేరి, ఆదివారం బెళగావి నుంచి తిరిగి వస్తుంది. నగర పరిసర ప్రాంతాల నుంచి ప్రయాణించే వారికి ఈ రైలు అదనపు సౌకర్యాన్ని కల్పిస్తుంది.

Advertisement

Read Also: విమానంలా రైల్లో సీటు సెలెక్షన్ ఉండదు, కారణం ఏంటంటే?

ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?

ఈ మూడు రైళ్లు వారానికి ఒక్కసారి నడిచే విధంగా ప్రణాళిక చేశారు. మార్గమధ్యంలో బళ్లారి, హుబ్బళ్లి, గడగ్, ధార్వాడ్, లోండా లాంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. ఈ స్టాప్స్ వల్ల ఉత్తర కర్ణాటక ప్రాంత ప్రజలకు కూడా హైదరాబాద్ వైపు ప్రయాణం చేయడం సులభమవుతుంది. రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం మాత్రమే కాదు, వాణిజ్య, విద్య, పర్యాటక రంగాలకు కూడా మేలు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా బెళగావి, హుబ్బళ్లి లాంటి నగరాలకు హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ రైళ్లకు సంబంధించిన  ప్రారంభ తేదీలను రైల్వే శాఖ త్వరలో ప్రకటించనుంది.

Read Also: రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. అరగంట ముందు కూడా బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×