E-Paper
Advertisement

Indian Railways: రైల్వే టికెట్లపై వీరికి 100 శాతం డిస్కౌంట్, కారణం ఏంటంటే?

Indian Railways: రైల్వే టికెట్లపై వీరికి 100 శాతం డిస్కౌంట్, కారణం ఏంటంటే?
Advertisement

IRCTC Ticket Booking:

దేశంలో ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తారు. వారి బడ్జెట్ ను బట్టి జనరల్, స్లీపర్, ఏసీ కోచ్ లలో ప్రయాణం చేస్తుంటారు. ఏసీ, స్లీపర్ కోచ్ లలో టికెట్ కన్ఫార్మ్ అయిన ప్రతి ఒక్కరికీ బెర్త్ లభిస్తుంది. కానీ, జనరల్ లో సీట్ గ్యారెంటీ అనేది ఉండదు. సెకెండ్ క్లాస్ టికెట్ కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరు జనరల్ సీట్ లోనే వెళ్లాల్సి ఉంటుంది. అయితే, భారతీయ రైల్వే కొంత మందికి టికెట్ కాస్ట్ లో రాయితీ అందిస్తుంది. దానికి కారణం ఏంటంటే..

రోగులకు ప్రత్యేక రాయితీ

ఆరోగ్య కారణాలతో ప్రయాణించే వారికి భారతీయ రైల్వే ఛార్జీలలో రాయితీని కల్పిస్తుంది. ఈ తగ్గింపు అనేది ఆయా ఆరోగ్య సమస్యను బట్టి ఉంటుంది. రోగులకు ఆర్థిక ఉపశమనం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రాయితీ ద్వారా వారు చికిత్స కోసం సులభంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.

క్యాన్సర్ రోగులకు  ఎక్కువ రాయితీ

Advertisement

క్యాన్సర్ రోగి తన భాగస్వామితో ప్రయాణిస్తుంటే, రైల్వే అతడికి/ఆమెకు స్లీపర్, AC-3 టైర్‌ లో 100 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. ఫస్ట్ AC, AC-2 టైర్‌లో 50 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్‌లో 75 శాతం డిస్కౌంట్ ఇవ్వబడుతుంది.

హార్ట్ సర్జరీ, డయాలసిస్ రోగులకు..

గుండె ఆపరేషన్, డయాలసిస్ కోసం ప్రయాణించే రోగులకు రైల్వే సెకండ్ క్లాస్, స్లీపర్, ఫస్ట్ క్లాస్, AC-3 టైర్, AC చైర్ కార్‌ లలో 75 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తుంది. ఫస్ట్ AC, AC-2 టైర్‌ లో 50 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. వారి అటెండర్లకు కూడా అదే సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

TB, ఇతర తీవ్రమైన వ్యాధులు

Advertisement

TB రోగులు, వారి అటెండర్లకు సెకండ్, స్లీపర్, ఫస్ట్ క్లాస్‌లో 75 శాతం ఛార్జీ మినహాయింపు లభిస్తుంది. దీనితో పాటు, రక్తహీనత రోగులకు స్లీపర్, AC చైర్ కార్, AC-3, AC-2 టైర్‌లో 50 శాతం డిస్కౌంట్ ఇవ్వబడుతుంది, తద్వారా చికిత్స కోసం ప్రయాణం సులభతరం అవుతుంది.

తలసేమియా, కుష్టు వ్యాధి గ్రస్తులకు

అటు కుష్టు వ్యాధిగ్రస్తులకు సెకెండ్, స్లీపర్, ఫస్ట్ క్లాస్ లో 75 శాతం రాయితీ ఇవ్వబడుతుంది. తలసేమియా, హిమోఫిలియా రోగులు చికిత్స,  చెకప్ కోసం వెళ్తే ఒక అటెండర్‌ కు 75 శాతం తగ్గింపు ఇవ్వబడుతుంది. ఎయిడ్స్ రోగులకు సెకెండ్ క్లాస్ లో 50 శాతం ఛార్జీ మినహాయింపు లభిస్తుంది.

రైల్వే టికెట్ల మీద తగ్గింపు పొందాలంటే ఎలా?

రైల్వే అందించే రాయితీ పొందడానికి, సదరు వ్యాదిగస్తులు గుర్తింపు పొందిన ఆసుపత్రి జారీ చేసిన వైద్య ధృవీకరణ పత్రం కాపీని ఇవ్వాలి. వికలాంగులైన ప్రయాణికులు టికెట్ బుకింగ్ సమయంలో వైకల్య ధృవీకరణ పత్రాన్ని చూపించాలి. ఈ సౌకర్యం 300 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది.

Read Also:  ఆ విమానంలోని సీట్ల నిండా బంగాళ దుంపల బస్తాలు వేశారు.. ఎందుకో తెలుసా?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×