E-Paper
Advertisement

Pakistan Railways: బాబోయ్.. మేం నడపలేం, చేతులెత్తేసిన పాక్ రైల్వే, పలు రైళ్లు ప్రైవేట్ పరం!

Pakistan Railways: బాబోయ్.. మేం నడపలేం, చేతులెత్తేసిన పాక్ రైల్వే, పలు రైళ్లు ప్రైవేట్ పరం!
Advertisement

పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకు మరింత దిగజారుతోంది. ఇప్పటికే ప్రజలు గోధుమ పిండి కూడా లేక అవస్థలు పడుతుండగా, ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం పరిస్థితి కూడా అంతే దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పాకిస్తాన్ రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న రైళ్లు ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కొన్ని రైళ్లను కమర్షియల్ ఆపరేషన్స్ కోసం ప్రైవేట్ రంగానికి అప్పగించాలని భావిస్తోంది. ఇప్పటికే  ఏ రైళ్లను ప్రైవేట్ పరం చేయాలనే అంశానికి సంబంధించి కసరత్తు పూర్తి చేసినట్లు ఆ దేశ రైల్వే అధికారులు వెల్లడించారు.

11 ప్యాసింజర్ రైళ్లు ప్రైవేట్ పరం

Advertisement

ప్రస్తుతం పాక్ రైల్వే సంస్థ నడిపిపిస్తున్న 11 ప్యాసింజర్ రైళ్ల నిర్వహణను ప్రైవేట్ రంగానికి అప్పగించాలని నిర్ణయించింది.  హజారా ఎక్స్‌ ప్రెస్, బహావుద్దీన్ జకారియా ఎక్స్‌ ప్రెస్, మిల్లత్ ఎక్స్‌ ప్రెస్, సుబక్ ఖరం ఎక్స్‌ ప్రెస్, రావల్ ఎక్స్‌ ప్రెస్, బదర్ ఎక్స్‌ప్రెస్, ఘోరి ఎక్స్‌ ప్రెస్, రవి ఎక్స్‌ ప్రెస్, థాల్ ఎక్స్‌ ప్రెస్, ఫైజ్ అహ్మద్ ఫైజ్, మోయెంజో దారో ప్యాసింజర్ రైళ్లను వాణిజ్య నిర్వహణ కోసం ప్రైవేట్ రంగానికి అప్పగించబోతోంది.

ఆగష్టు 12 లోపు బిడ్ల ఆహ్వానం

Advertisement

అటు ఆగష్టు 12 లోపు ప్రైవేట్ రంగం నుంచి బిడ్లను ఆహ్వానించాలని పాకిస్తాన్ రైల్వే  నిర్ణయించింది. పాకిస్తాన్ రైల్వే ఇప్పటికే ఏడు ప్యాసింజర్ రైళ్ల నిర్వహణను ప్రైవేట్ రంగానికి అవుట్‌ సోర్స్ చేసింది.  హజారా ఎక్స్‌ ప్రెస్, కరాచీ ఎక్స్‌ ప్రెస్, ఫరీద్ ఎక్స్‌ ప్రెస్, బహావుద్దీన్ జకారియా ఎక్స్‌ ప్రెస్, సుక్కూర్ ఎక్స్‌ ప్రెస్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇప్పటికే ప్రైవేట్ పరం చేసింది. కొద్ది నెలల్లోనే  మరో 11 రైళ్లను ఔట్ సోర్స్ చేయలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో పాక్ రైల్వే పూర్తిగా ప్రైవేట్ పరం అయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

పాక్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే?

ప్రస్తుతం పాకిస్తాన్ రైల్వే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని రైళ్లను ప్రైవేట్ పరం చేసి, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని రైల్వేశాఖ మౌళిక సదుపాయాలను మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్థిక సమస్యల్లో ఉన్న పాకిస్తాన్ రైల్వే ఆదాయాన్ని పెంచుకు మార్గాలను అన్వేషిస్తోంది.  ఇందులో భాగంగానే టికెట్ ధరలను రెండుసార్లు పెంచింది. ఈ నెల ప్రారంభంలో ప్యాసింజర్, ఎక్స్‌ ప్రెస్, మెయిల్ రైళ్లకు సంబంధించి టికెట్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేవలం 15 రోజుల్లో రెండు సార్లు టికెట్ ఛార్జీలు పెంచడంతో ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. డీజిల్ ధర పెరుగుదల కారణంగా పాకిస్తాన్ రైల్వే నెలకు 109 మిలియన్ల నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి.  పాకిస్తాన్ లో పెట్రోల్ ధరను కూడా ప్రభుత్వం లీటరుకు రూ.  8.36 పెంచింది.

Read Also: రైలులో టీటీఈకి.. మీ టికెట్ చూపించి కన్ఫార్మ్ చేయించుకోకపోతే ఏమవుతుంది?

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×