E-Paper
Advertisement

Amrit Bharat Express: డ్రోన్ సాయంతో రైలు మొత్తాన్ని కడిగేశారు.. జస్ట్ అరగంటలోనే!

Amrit Bharat Express: డ్రోన్ సాయంతో రైలు మొత్తాన్ని కడిగేశారు.. జస్ట్ అరగంటలోనే!
Advertisement

Indian Railway:

భారతీయ రైల్వేలో రైళ్లను శుభ్రం చేయడం అనేది అత్యంత శ్రమతో కూడుకున్న వ్యవహారం. ఇప్పటి వరకు మనుషులు రైళ్లను కడిగే వాళ్లు. కానీ, ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించి రైళ్లను క్లీన్ చేస్తున్నారు. గుజరాత్‌ లో మొట్టమొదటి సారిగా అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్ రైలు ను డ్రోన్ సాయంతో కడిగారు. ఈ డ్రోన్ జస్ట్ 30 నిమిషాల్లోనే 25 కోచ్ లను సక్సెస్ ఫుల్ గా శుభ్రం చేసింది. మనుషులతో పోల్చితే అత్యంత వేగంగా, మరింత శుభ్రంగా పని పూర్తి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే దేశ వ్యాప్తంగా రైళ్లను ఈ డ్రోన్ల ద్వారా శుభ్రం చేసే దిశగా అధికారులు ఆలోచిస్తున్నారు.

సక్సెస్ ఫుల్ గా ట్రయల్ కంప్లీట్

వాటర్ డ్రోన్ వ్యవస్థను ఉపయోగించి రైళ్లను కడగడానికి రైల్వే అధికారులు తాజాగా ట్రయల్ నిర్వహించారు. ఉధ్నా-బ్రహ్మపూర్ అమృత్ భారత్ రైలు కోచ్‌లను డ్రోన్‌ ల సహాయంతో గుజరాత్ లో వాష్ చేశారు. సూరత్, ఉధ్నా రైల్వే స్టేషన్లలో 24 రైలు కోచ్‌లను కడగడానికి డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించారు. వాటర్ డ్రోన్‌ ను కోచ్ లను శుభ్రం చేయడానికి వాడారు.  ఈ టెక్నాలజీని ఉపయోగించి, 25 కోచ్‌ లను జస్ట్ 30 నిమిషాల్లో శుభ్రంగా కడిగారు. ఇంతకు ముందు ఎక్కువ మంది వ్యక్తులు, ఒక్క రైలును కడగడానికి కనీసం మూడు గంటలు సమయం తీసుకునే వాళ్లు. కానీ, ఇప్పుడు అరగంటలో క్లీన్ చేశారు.

జస్ట్ రూ. 4 లక్షలతో వాటర్ డ్రోన్ తయారీ

Advertisement

రైళ్లను శుభ్రం చేసే డ్రోన్లను సూరత్‌కు చెందిన ఇద్దరు యువకులు తయారు చేశారు. దీనిని తయారు చేయడానికి సుమారు రూ. 4 లక్షలు ఖర్చు అయ్యింది. గుజరాత్ మొట్టమొదటి అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్ రైలు ఉధ్నా రైల్వే స్టేషన్‌కు వచ్చినప్పుడు ఈ డ్రోన్‌ను పరీక్షించారు. రైలు కోచ్‌లను డ్రోన్ ఉపయోగించి శుభ్రం చేశారు. ఎలివేషన్, ఎత్తైన ప్రదేశాలను శుభ్రం చేయడానికి ఈ డ్రోన్ చక్కగా ఉపయోగపడింది. రూఫింగ్ షీట్ల ను కూడా చక్కగా శుభ్రం చేసింది. ఈ ట్రయల్ రైల్వే అధికారుల సమక్షంలో జరిగింది. ఈ ట్రయల్ కొద్ది నిమిషాల్లోనే సక్సెస్ అయ్యింది. రైల్వే అధికారులు ఈ విషయాన్ని ప్రాసెస్ చేసి, దానిని ఆమోదించాలా? వద్దా? అని నిర్ణయిస్తారు.

ఈ ఏడాది మేలో తొలిసారి డ్రోన్ ట్రయల్

ఈ ఏడాది మేలో తొలిసారి అస్సాంలోని కామాఖ్య రైల్వే స్టేషన్‌లో ఆపి ఉంచిన రైలును డ్రోన్‌ని ఉపయోగించి శుభ్రం చేశారు. ఇప్పటి వరకు మనుషులు శుభ్రం చేయగా, ఇప్పుడు డ్రోన్ సాయంతో కడగబోతున్నారు.  ఒక రైలుగమ్యస్థాన స్టేషన్‌ కు చేరుకోగానే, ప్రయాణీకులు దిగిన తర్వాత దానిని శుభ్రం చేస్తారు. ఇప్పటి వరకు మనుషులు మ్యానువల్ గా రైళ్లను కడిగేవారు. పైపుల ద్వారా నీటిని చల్లి కడిగే వారు. ఈ పద్దతిలో చాలా సమయం పట్టేది. ఎక్కువ మ్యాన్ పవర్ కావాల్సి వచ్చేది. ఈ సాంకేతికత ప్రయోజనకరంగా ఉంటుందని డ్రోన్ తయారీ విద్యార్థులు వెల్లడించారు. వీటిని ఇండియన్ రైల్వేలోకి ప్రవేశపెట్టే విషయంపై త్వరలో అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

Read Also: సికింద్రాబాద్ స్టేషన్‌లో రైలు నుంచి జారిపడ్డ ప్రయాణీకుడు.. కానిస్టేబుల్ చేసిన పనికి అంతా షాక్!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×