E-Paper
Advertisement

Warangal : అధికారుల నిర్లక్ష్యం.. వృద్ధుడికి శాపం..

Warangal : అధికారుల నిర్లక్ష్యం.. వృద్ధుడికి శాపం..
Advertisement

Warangal : అధికారుల నిర్లక్ష్యం ఓ వృద్ధుడి పాలిట శాపమైంది. బ్రతికుండగానే చనిపోయినట్టు రికార్డుల్లోకి ఎక్కించారు. దీంతో ఆ వృద్ధుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు దూరమయ్యాయి. జీవిత చెరమాంకంలో సర్కార్ నుంచి ఎలాంటి సాయం అందకుండా పోయింది. అధికారుల తప్పిదం వల్ల తన జీవితం ఆగమ్యగోచరంగా మారిందని వాపోతున్నాడు ఆరేపల్లి అంకూస్ అనే వృద్ధుడు. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా చిట్యాలలో జరిగింది. తనకు జరిగిన అన్యాయం గురించి అధికారులకు విన్నవించేందుకు వృద్ధుడు రెండు నెలలుగా అధికారుల చుట్టూ తిరిగిన ఎలాంటి ఫలితం లేదని బాధపడుతున్నాడు.

రికార్డుల్లో చనిపోయాడని ఉండడంతో.. ఆరెపల్లి అంకూస్‌కు రేషన్ బియ్యం రావడం లేదు. చేతకాని ఈ వయసులో రేషన్ అందకపోతే తాను ఎలా బతకాలని వాపోతున్నాడు. బ్రతికున్న మనిషిని చనిపోయాడని ఎలా రికార్డులకు ఎక్కిస్తారని ప్రశ్నిస్తున్నాడు వృద్ధుడు. అధికారుల తీరు కారణంగా ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలు రావడం లేదని.. రెండు నెలలుగా బియ్యం రాక, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదన్నారు.

Advertisement

ఎవరూ లేక ఒంటరిగా ఉన్న తనను ఇబ్బందులకు గురిచేయడం దారుణమని అంకూస్ తెలిపారు. ఈ ఘటనపై రేషన్ డీలర్ ను సంప్రదిస్తే అంకూస్ కు రేషన్ బియ్యం రావడం లేదన్నది నిజమేనని తెలిపారు..ఆన్ లైన్ లో తన పేరు లేదని ఈ విషయం పై అధికారుల దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వృద్ధుడు వేడుకుంటున్నాడు. ఈ నెల అయిన రేషన్ బియ్యం అందించాలని కోరుకుంటున్నాడు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×