E-Paper
Advertisement

TRS : ఎంపీ Vs ఎమ్మెల్యే .. మంత్రుల ఎదుటే మాటల యుద్ధం..

TRS : ఎంపీ Vs ఎమ్మెల్యే .. మంత్రుల ఎదుటే మాటల యుద్ధం..
Advertisement

TRS : పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు టీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. మహబూబాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ..మంత్రుల ఎదుటే మాటల యుద్ధానికి దిగారు. కొత్తగా నిర్మించిన టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం వేదికగా ఈ ఇద్దరు నేతల మధ్య మాటల తుటాలు మరోసారి పేలాయి. ఈ కార్యాలయాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ పరిశీలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పార్టీ కార్యాలయ పనులను తానే సొంతంగా చేయించానని ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెప్పడంతో వివాదం మొదలైంది. శంకర్ నాయక్ మాటలపై ఎంపీ కవిత ఫైర్ అయ్యారు. కార్యాలయం నిర్మాణ వ్యయాన్ని పార్టీనే భరిస్తోందని స్పష్టం చేశారు. ఇందులో ఎమ్మెల్యే చేసిందేమి లేదని తేల్చిచెప్పారు. దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం హీటెక్కింది. ఎంపీ, ఎమ్మెల్యేకు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ సర్దిచెప్పడంతో తాత్కాలికంగా ఈ వివాదం సద్దుమణిగింది.

గతంలో ఎంపీ మాలోత్ కవిత, శంకర్ నాయక్ మధ్య వివాదం నడించింది. రైతు దీక్ష సభలో మాట్లాడుతున్న సమయంలో ఎంపీ కవిత చేతిలో నుంచి శంకర్ నాయక్ మైక్ లాక్కోవడం వివాదాస్పదమైంది.ఆ సమయంలో తామంటే తాము ముందు మాట్లాడాలని ఇద్దరు నేతలు పోటీపడ్డారు. ఈ ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరుపై పార్టీ నేతల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మంత్రుల ఎదుటే వాదించుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. కవిత , శంకర్ నాయక్ మధ్య ఆధిపత్య పోరు పార్టీకి నష్టం కలిగిస్తుందని గులాబీ నేతలు మదనపడుతున్నారు. ఈ నేతల ఇష్యూలో పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×