E-Paper
Advertisement

Vande bharat train: సికింద్రాబాద్ నుంచి మరో వందేభారత్ ట్రైన్.. పీఎం మోదీ స్కెచ్ మామూలుగా లేదుగా..

Vande bharat train: సికింద్రాబాద్ నుంచి మరో వందేభారత్ ట్రైన్.. పీఎం మోదీ స్కెచ్ మామూలుగా లేదుగా..
Advertisement

Vande bharat train: రైల్వే విషయంలో మోదీ సర్కార్ తెలివిగా వ్యవహరిస్తోందా? కొత్త రైళ్లపై బడ్జెట్‌లో ఏ మాత్రం నోరు మెదపకుండా సైలెంట్‌గా ఎందుకుంది? కేవలం వందేభారత్ రైళ్లపై ఫోకస్ చేసిందా? ఆదాయం పెంచడం కోసమే ఈ రైళ్లను మోదీ సర్కార్ ప్రవేశపెట్టిందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది మోదీ పాలన. దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని ఓ వైపు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ప్రజల ఆదాయాలు పెంచాల్సిన ప్రభుత్వం .. కేవలం ఖరీదైన రైళ్లపైనే ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది.

Advertisement

ALSO READ: ఎమ్మెల్యేల అనర్హత ఇష్యూ.. కేసీఆర్ హ్యాపీగా లేరా? ఆ విషయం ముందే తెలుసా?

ఆదాయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు మోదీ సర్కార్. గడిచిన పదేళ్లలో కొత్త రైళ్ల మాటేమోగానీ.. కేవలం వందే భారత్ రైళ్లకు మాత్రమే పచ్చజెండా ఊపారు. దేశవ్యాప్తంగా ఈ తరహా రైళ్లను ప్రవేశ పెట్టారు. వీటి టారిఫ్ కూడా అదే రేంజ్‌లో ఉందనుకోండి. కానీ ప్రజల ఆదాయం మాత్రం అంతంత మాత్రమే.

Advertisement

సెప్టెంబర్ 15న మరో 10 రైళ్లను వర్చువల్ పద్దతిలో జెండా ఊపనున్నారు ప్రధాని నరేంద్రమోదీ. 10 రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 10 రైళ్లను ప్రారంభించనున్నారు. అందులో తెలంగాణ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వరకు ఒక రైలు ఉంది.

సికింద్రాబాద్‌లో ఉదయం ఐదు గంటలకు బయలు దేరి మధ్యాహ్నం 12.15 గంటలకు నాగపూర్‌కు చేరుకోనుంది. అదే రైలు నాగపూర్‌లో మధ్యాహ్నం  ఒంటి గంటకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు సికింద్రాబాద్‌కు రానుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య 578 కిలోమీటర్లు కాగా, కేవలం ఏడున్నర గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. కాజీపేట, రామగుండం, చంద్రాపూర్, సేవాగ్రామ్‌లో మాత్రమే ఆగనుంది.

ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి బెంగుళూరుకు మాత్రమే వందేభారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా సికింద్రాబాద్ నుంచి నాగ్ పూర్ వరకు కొత్త రైలు రానుంది.

ఏపీలోని విశాఖ నుంచి మరో వందే భారత్ రైలును అందుబాటులోకి రానున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒడిశాలోని దుర్గ్-విశాఖపట్నం మధ్య నడననుంది. ఉదయం 6 గంటలకు దుర్గ్‌లో బయలుదేరి మధ్యాహ్నం 1.55 గంటలకు విశాఖపట్నం చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి రాత్రి 10.50 గంటలకు దుర్గ్‌కు వెళ్తనుంది.

టాటానగర్-పాట్నా, వారణాసి-డియోఘర్, టాటానగర్-బ్రహ్మాపూర్, రాంచీ-గొడ్డ, ఆగ్రా-బనారస్, హౌరా-గయా, హౌరా-భాగల్‌పూర్, దుర్గ్-విశాఖపట్నం, హుబ్లీ-సికింద్రాబాద్, పూణె-నాగపూర్ ప్రాంతాల రైళ్లను ఆదివారం ప్రారంభించనున్నారు ప్రధాని. కొత్త రైళ్ల జాబితాలో జార్ఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్, యూపీ వంటి రాష్ట్రాలున్నాయి.

ఈ కొత్త రైళ్ల ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగు పడుతుందని మోదీ సర్కార్ చెబుతోంది. ప్రయాణ మౌలిక సదుపాయాలను పెరుగుతాయని అంటోంది. కీలక నగరాలకు ఆయా రైళ్లను అనుసంధానం చేయడం ద్వారా లక్షలాది మంది ప్రయాణికుల ట్రావెలింగ్ మరింత సులభం కానుంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×