E-Paper
Advertisement

Yadagirigutta: యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. స్వామివారిని దర్శించుకున్న కొండా సురేఖ, బీర్ల ఐలయ్య

Yadagirigutta: యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. స్వామివారిని దర్శించుకున్న కొండా సురేఖ, బీర్ల ఐలయ్య
Advertisement

Yadagirigutta: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు సర్వంగ సుందరంగా ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలు “గోవింద నామస్మరణ”తో మారుమోగిపోతున్నాయి.

మంగళవారం తెల్లవారుజామున ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ విశిష్ట దర్శనం కోసం వేలాదిమంది భక్తులు బారులు తీరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.

Advertisement

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు, క్యూలైన్లలో వేచి ఉన్న వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం అందుబాటులో ఉంటుందని ఆలయ ఈఓ (Executive Officer) స్పష్టం చేశారు. సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కలిగేలా వీఐపీ బ్రేక్ దర్శనాలపై నియంత్రణ విధించారు.

Advertisement

జూబ్లీహిల్స్ టీటీడీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి శోభ
అలాగే జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు పోటెత్తారు. ఇక్కడ తెల్లవారుజాము నుండే స్వామి వారు భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తున్నారు. అయితే ఈ దర్శనం ఇవాళ రాత్రి 10 గంటల వరకు కొనసాగనుంది.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఘోరంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఆయా జిల్లాలకు అలర్ట్..

నగరంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పోటెత్తడంతో ఆలయ పరిసరాలన్నీ గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తుల సౌకర్యార్థం టీటీడీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు నిరంతరాయంగా మజ్జిగ, బాదం పాలు పంపిణీ చేస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×