E-Paper
Advertisement

Utham Kumar Reddy: జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష

Utham Kumar Reddy: జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష
Advertisement

Utham Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం (నవంబర్ 22) హైదరాబాద్‌లోని జలసౌధలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బోస్ (BOCE) కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ పనులు, నూతన ప్రతిపాదనలపై అధికారులతో మంత్రి చర్చించారు

తుమ్మడిహెట్టి నుంచి 80 టీఎంసీల నీటిని ఏవిధంగా వాడుకోవాలనే అంశంపై చర్చించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తుమ్మడిహెట్టికి సంబంధించి ఎత్తు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరుపాలని ఇంజనీర్లతో కూలంకషంగా చర్చించినట్లు తెలిపారు.  అదేవిధంగా సవరించిన అంచనాల ప్రతిపాదనలు (Revised Estimates), భూసేకరణ (Land Acquisition), పునరావాస (R&R) సమస్యలపై కూడా చర్చ జరిగినట్లు మంత్రి తెలిపారు.

Advertisement

ఈ సమావేశంలో ప్రధానంగా ప్రాజెక్టుల వారీగా ప్రాధాన్యతలను గుర్తించడంపై మంత్రి దృష్టి సారించారు. రాబోయే 6 నుండి 36 నెలల కాలంలో కొత్తగా ఆయకట్టును (Ayacut) అందుబాటులోకి తెచ్చే ప్రాజెక్టుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే,  సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో పర్యావరణ అనుమతుల అంశాన్ని కూడా ఈ సమీక్షలో మంత్రి పరిశీలించారు.

Read Also: I Bomma Ravi: ఐబొమ్మ రవి విలాసాల చిట్టా విప్పిన పోలీసులు.. నెదర్లాండ్స్‌లో సర్వర్లు, 20 రోజులకోసారి విదేశీ యాత్ర!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×