E-Paper
Advertisement

Komaram Bheem: కొమురం భీం జిల్లాలో కొట్లాడుకున్న పులులు.. మరోపులి మృతి..

Komaram Bheem: కొమురం భీం జిల్లాలో కొట్లాడుకున్న పులులు.. మరోపులి మృతి..
Advertisement

Komaram Bheem: కొమురం భీం జిల్లాలో వరుసగా పులుల మరణాలు కలకలం రేపుతున్నాయి. కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో మరో పులి మృతదేహాన్ని అటవీ అధికారులు గుర్తించారు. రెండు పులుల మధ్య జరిగిన ఘర్షణలో ఐదు రోజుల క్రితం ఓ ఆడ పులి చనిపోయింది. రెండో పులి గాయపడిందని అధికారులు తెలిపారు. అయితే.. ఆ రెండో పులి డెడ్ బాడీని కూడా సోమవారం గుర్తించారు. గాయాలతో రెండో పులిని గుర్తించినపుడు అధికారులు ట్రాప్ కెమెరాలను పరిశీలించారు. దీంతో.. ఆ రెండు పోట్లాడుకున్నాయని తేల్చారు. మొదటి పులి మృతదేహానికి కొంతదూరంలో నిన్న రెండో పులి మృతదేహం కూడా కనిపించింది. పులుల సంరక్షణ ప్రత్యేక అధికారులు, వెటర్నరీ అధికారుల బృందం సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టింది.

దరిగాం అటవీ ప్రాంతంలో 3 రోజుల వ్యవధిలోనే 2 పులులు మృతి చెందాయి. టెరిటోరియల్ ఫైట్ లో ఒక పెద్దపులి మృతి చెందగా.. మూడు సంవత్సరాల వయసున్న మరో పులి సైతం మరణించింది. పీసీసీఎఫ్ రాకేశ్ డోబ్రియల్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ పరగ్వేన్ అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. ఆశ్రయం కోసమే రెండు పులులు కొట్లాడుకుని ఉంటాయని భావిస్తున్నారు. తొలుత మృతి చెందిన పులికి పోస్ట్ రూట్ నిర్వహించి శాంపిళ్లను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. అనంతరం NTCA నిబంధనల ప్రకారం చనిపోయిన పులిని ఖననం చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×