E-Paper
Advertisement

Sunstroke Deaths : వడదెబ్బకు ఇద్దరు మృతి.. దయచేసి బయటకు రాకండి..

Sunstroke Deaths : వడదెబ్బకు ఇద్దరు మృతి.. దయచేసి బయటకు రాకండి..
Advertisement

Two Died of Sunstroke in Telangana : ఎండలు మండిపోతున్నాయి. ఓ వైపు ఉక్కపోత, మరోవైపు తీవ్ర వడగాలులు ప్రజలకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఎర్రటి ఎండలో బయటికెళ్తే.. దాదాపు మృత్యువును దగ్గరగా చూసినంత పనవుతుంది. కళ్లు బైర్లు కమ్మి.. దిమ్మ తిరిగిపోతుంది. తాజాగా తెలంగాణలో వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో వడదెబ్బతో ఇద్దరు మరణించారు.

కొమురం భీం జిల్లాలో ఒకరు, మంచిర్యాల జిల్లాలో మరొకరు మృత్యువాత పడ్డారు. కొమురం భీం జిల్లా, కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారమ్ 2 లో గుర్తుతెలియని వృద్ధుడు వడదెబ్బకు మరణించాడు. అలాగే మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలోని వినాయక్ నగర్ కు చెందిన మేడిశెట్టి మహేశ్ మరణించాడు. కాగా.. గత శుక్రవారం వేములవాడ లోని అచ్చన్నపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న బీహార్ కు చెందిన శంకర్ సదా వడదెబ్బ తగిలి చనిపోయాడు. నల్గొండ జిల్లాలో ప్రైవేట్ టీచర్ మృతి చెందింది.

Advertisement

Also Read : ఏపీలో నెత్తురోడిన రహదారులు.. ఆరుగురు మృతి

వడదెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతుండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణశాఖ. అనవసరంగా బయట తిరగవద్దని, నీడ పట్టున ఉండాలని సూచించింది. రైతులు కూడా ఎండ తక్కువగా ఉన్న సమయాల్లో పనులు పూర్తిచేసుకోవాలని తెలిపింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×