E-Paper
Advertisement

Minister Tummala: రైతులకు గుడ్ న్యూస్.. మూడో విడత రుణమాఫీ తేదీ వెల్లడించిన మంత్రి

Minister Tummala: రైతులకు గుడ్ న్యూస్.. మూడో విడత రుణమాఫీ తేదీ వెల్లడించిన మంత్రి
Advertisement

Minister Tummala: ఆగస్టు 15న మూడవ విడత రుణమాఫీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. స్వాతంత్ర్య వేడుకల రోజు వైరాలో సీఎం రేవంత్ రెడ్డి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ ప్రారంభిస్తారని వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు చెందిన గోదావరి జలాల విడుదల కార్యక్రమానికి సంబంధించిన సభలోనే రుణమాఫీ ప్రారంభిస్తారని చెప్పారు. మూడవ విడతలో సుమారు. 6 వేల మంది రైతులకు దాదాపు 6 వేల కోట్ల రుణాలు మాఫీ కానున్నాయని అన్నారు.

Also Read:  ఎమ్మెల్యేలను తొక్కేస్తున్నారా? బీజేపీలో గ్రూపు వార్

Advertisement

సాంకేతిక కారణాల వల్ల రెండు విడతల్లో 30 వేల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని, పొరపాట్లన్నీ సరి చేసి అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీపై ఆరోపణలు, అనుమానాలు, అసత్య ప్రచారం చేయడం సరికాదని అన్నారు. రుణమాఫీపై రాజకీయ విమర్శలు దురదృష్టకరమని తెలిపారు. రైతాంగాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ది పొందలేరని తెలిపారు. ప్రక్రియ పూర్తి కాకముందే విమర్శలు చేయవద్దన్న ఆయన.. రుణమాఫీకి ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించి రైతుల మనో భావాలను దెబ్బతీయవద్దని హితవు పలికారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×