E-Paper
Advertisement

TS Prajapalana: తెలంగాణలో ప్రజాపాలనకు భారీ స్పందన.. తొలిరోజు 7,46,414 అర్జీలు

TS Prajapalana: తెలంగాణలో ప్రజాపాలనకు భారీ స్పందన.. తొలిరోజు 7,46,414 అర్జీలు
Advertisement

TS Prajapalana: తెలంగాణలో ప్రజాపాలన ఫస్ట్ డే సూపర్ హిట్ అయింది. మొదటి రోజు ప్రజల నుంచి అనూహ్యాస్పందన వచ్చింది.రాష్ట్ర వ్యాప్తంగా 7లక్షల 46వేల 414 అర్జీలు వచ్చాయని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. హైదరాబాద్ సహా.. పట్టణాల నుంచే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. పట్టణాల నుంచి 4లక్షల 57వేల 703 దరఖాస్తులు రాగా.. గ్రామాల నుంచి 2 లక్షల 88వేల 711 దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెప్పారు.

ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ తొలి రోజు పూర్తైన తర్వాత సీఎస్ శాంతి కుమారి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతీ జిల్లా కేంద్రంలోనూ సరిపడేలా ఆరు గ్యారెంటీల అభయహస్తం దరఖాస్తు ఫారాలు ఉంచాలని కలెక్టర్లకు సూచించారు. అభయహస్తం ఫామ్లు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

ఈ గ్రామ సభలకు హాజరయ్యే వారికి మంచినీరు అందుబాటులో ఉంచాలన్నారు. క్యూ లైన్లు పాటించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రతీ వంద మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని.. ప్రజాపాలనలో స్వీకరించిన ప్రతీ దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్ ఇవ్వాలని చెప్పారు. ఇక.. ఫారాలను నింపడానికి ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని సీఎస్ జిల్లా అధికారులకు ఆదేశారు జారీ చేశారు.

.

Advertisement

.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×