E-Paper
Advertisement

ప్రజలకు కరెంట్ కష్టాలు ఉండొద్దు.. అధికారులకు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

ప్రజలకు కరెంట్ కష్టాలు ఉండొద్దు.. అధికారులకు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు
Advertisement

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌పై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఇంధన శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొని ప్రస్తుత పరిస్థితులను వివరించారు.

 ఎండల తీవ్రత దృష్ట్యా విద్యుత్ కోతలు లేకుండా చూడాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.  ఆసుపత్రులు, తాగునీటి సరఫరా కేంద్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.  రాష్ట్రంలో భానుడి ప్రతాపం వల్ల ఇళ్లు కార్యాలయాల్లో ఏసీలు కూలర్ల వినియోగం విపరీతంగా పెరిగిందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి తోడు వ్యవసాయ అవసరాల కోసం రైతులు పెద్ద ఎత్తున విద్యుత్ వాడుతుండటంతో గ్రిడ్‌పై ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ మార్కెట్‌లో ఒత్తిడి ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర అవసరాలకు ఏమాత్రం లోటు రాకుండా చూడాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. పవర్ ఎక్స్ఛేంజీల ద్వారా అదనపు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు.

Advertisement

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పూర్తి సామర్థ్యంతో వినియోగించుకోవాలని మంత్రి ఆదేశించారు. జల విద్యుత్ ఉత్పత్తిని సమర్థంగా నిర్వహించాలని అధికారులకు వివరించారు. ముఖ్యంగా ఆసుపత్రులు తాగునీటి సరఫరా పథకాలు అత్యవసర సేవలకు ఎక్కడా విద్యుత్ అంతరాయం కలగకుండా నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. విద్యుత్ వ్యవస్థ స్థిరంగా ఉందని ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు మంత్రికి భరోసా ఇచ్చారు.

రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని మంత్రి హెచ్చరించారు. అన్ని విద్యుత్ సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యమని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బందిని నిరంతరం అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు. వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

ఈ సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్ జెన్‌కో సీఎండీ హరీష్ ఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ వీ పాటిల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

ALSO READ: భారీ ఎండల నుంచి ఉపశమనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×