E-Paper
Advertisement

MP Aravind : ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి..

MP Aravind : ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి..
Advertisement

MP Aravind : బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హైదరాబాద్ లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఆయన నివాసాన్ని ముట్టడించి ఇంటిలోని అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఎంపీ ఇంట్లోకి చొరబడుతుండగా టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు.

ఇటీవల బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్..టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై విమర్శలు గుప్పించారు. ఆమె పార్టీ మారతారని ఆరోపించారు. ఆ సమయంలో ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. అందుకే దాడి జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

తన నివాసంపై దాడి జరిగిన సమయంలో ఎంపీ అరవింద్ హైదరాబాద్‌లో లేరు. నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశ సమావేశంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడి నేపథ్యంలో హైదరాబాద్ లోని బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటి వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×