E-Paper
Advertisement

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణ.. రంగంలోకి ట్రాన్స్‌జెండర్లు

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్  నియంత్రణ.. రంగంలోకి ట్రాన్స్‌జెండర్లు
Advertisement

Hyderabad: హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్‌జెండర్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్‌జెండర్లను నియమించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.

సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లేవారిని నిరోధించడం వీరి ప్రధాన బాధ్యత. హోమ్ గార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్ల సేవలు వినియోగించుకోనుంది ప్రభుత్వం. ఇక రాత్రి వేళ నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో కూడా వారి సేవలు వినియోగించుకోనుంది.

Advertisement

తద్వారా తాగి వాహనాలు నడపే వారి సంఖ్యను తగ్గించవచ్చన్నారు. హోమ్ గార్డ్ తరహాలో జీత భత్యాలను సమకూర్చేలా విధి విధానాలు రూపొందించాలని, అలాగే ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను రూపొందించనుంది. వీలైనంత త్వరగా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని అధికారులకు అదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి.

తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ట్రాన్స్‌జెండర్లపై ఫోకస్ చేసింది. సమాజంలో గౌరవప్రదంగా వారు జీవించేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే వారి ఆరోగ్య సేవలు అందించేందుకు మైత్రి క్లినిక్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది.

Advertisement

ALSO READ:  సురేష్ మా పార్టీ కార్య‌క‌ర్తే.. ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

నార్మల్‌గా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు ప్రజలకు అందుతాయి. ట్రాన్స్‌జెండర్లు మాత్రం వైద్యం చేయించుకునేందుకు ముందుకు వచ్చిన సందర్భాలు లేవు. వారికి వైద్యం చేయడానికి డాక్టర్లు సైతం ఆలోచిస్తారు.

ప్రభుత్వ ఆసుపత్రిల్లో మైత్రి పేరిట విభాగాన్ని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. ఈ సేవలను అధికారికంగా త్వరలో ప్రారంభించనున్నారు. వారానికి రెండురోజులు మాత్రమే ఓపీ సేవలు అందించనున్నారు. అది ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×