E-Paper
Advertisement

Mahesh Kumar Goud: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేది ఎవరో తెల్సిపోయింది.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేది ఎవరో తెల్సిపోయింది.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

TPCC Chief Mahesh Kumar Goud: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఫైరయ్యారు. ప్రాజెక్టులు, నిధులు రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డి తీరును ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని.. అభివృద్దిలో బీజేపీ నేతలు భాగస్వామ్యం కావాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు.

ALSO READ: CISF Recruitment: టెన్త్ అర్హతతో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్.. దరఖాస్తు చేసుకున్నారా..?

Advertisement

రాష్ట్రంలో కొంత మంది కావాలనే అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఎప్పుడూ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు విషం చిమ్ముతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధికి అడ్డుకోకుండా.. తగిన సూచనలు ఇవ్వాలని కోరారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని.. ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి, ప్రజలే తమకు ముఖ్యమని అన్నారు. ముఖ్యంగా ఈ రెండు పార్టీల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారారని వ్యాఖ్యానించారు. ఈ విషయానికి సంబంధించి బీజేపీ,  బీఆర్ఎస్ పార్టీలు లోపాయకారి ఒప్పందం కుదర్చుకున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వ  వైఖరి కారణంగా మెట్రో సెకండ్ ఫేజ్  పనులు ఆలస్యం అవుతాన్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.

ALSO READ: TGPSC Group-2,3 Results: గ్రూప్-2,3 ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చేసింది.. కొత్త నోటిఫికేషన్లు కూడా..?

Advertisement

మరోవైపు భాగ్యనగరానికి కీలకమైన మూసీ నది ప్రక్షాళనకు అడ్డు పడడానికి కారణం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందని.. కులగణనకు బీజేపీ తీవ్ర వ్యతిరేకంగా ఉందన్నారు. బీసీ కులగణన చేపట్టవద్దని ఆ పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిన విషయం నిజమా.. కాదా..? చెప్పాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

ALSO READ: NIRDPR Recruitment: డిగ్రీ అర్హతతో మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. భయ్యా ఈ జాబ్ వస్తే నెలకు రూ.1,90,000 జీతం

బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కులు అసలు బీజేపీ లేనే లేదని తీవ్ర స్థాయిలో మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఒక వేళ బీజేపీకి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీసీలపై చిత్త శుద్ధి కనుక ఉంటే.. దేశ వ్యాప్త సర్వే చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఒత్తిడి తీసుకురావాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×