E-Paper
Advertisement

Fire Accident : బిల్డింగ్ దట్టంగా పొగలు – ఓ చిన్నారి సహా ఇద్దరు మహిళలు మృతి

Fire Accident : బిల్డింగ్ దట్టంగా పొగలు – ఓ చిన్నారి సహా ఇద్దరు మహిళలు మృతి
Advertisement

Fire Accident : శుక్రవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాలగూడలో చోటుచేసుకున్న ఓ అగ్ని ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వీరంతా.. దట్టంగా పొగలు వ్యాపించడంతో ఊపిరాడక మృతి చెందినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఘటన విషయాలు తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది.. హుటాహుటిన మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు.

నార్శింగి పరిధిలోని పుప్పాలగూడలోని ఓ రెండు అంతస్తుల భవనంలో సాయంత్రం వేళ మంటలు చెలరేగాయి. బిల్డింగ్ లోని గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగడంతో భవనం మొత్తం దట్టమైన పొగ వ్యాపించింది. తొలుత భవనంలో మంటలు చెలరేగిన విషయం తెలుసుకున్న లంగర్‌ హౌస్‌ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దట్టంగా కమ్ముకున్న పొగల మధ్యలోనే భవనంలోకి వెళ్లిన సహాయక సిబ్బంది.. ముగ్గురిని బయటకు తీసుకువచ్చారు.

Advertisement

వీరిని మొదటి అంతస్తులోని ఓ గదిలో గుర్తించగా.. వారిలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. పొగను పీల్చడంతో వారంతా అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. దాంతో.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దట్టంగా అలుముకున్న పొగ మధ్యలో వారి ఆరోగ్య పరిస్థితి అప్పటికే క్షీణించినట్లుగా వైద్యులు గుర్తించారు.  కొంత సేపటికి ఆసుపత్రిలోనే ఇద్దరు మహిళలు, చిన్నారి ప్రాణాలొదిలారు.

Advertisement

ఈ ఘటనలో మృతి చెందిన వారికి సిజిరా(7), సహానా(40), జమీలా(70)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న మరో ఐదుగురిని సురక్షితంగా అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. మంటల ధాటికి భవనంలోని మూడు గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో.. ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.

అయితే.. అసలు బిల్డింగ్ లోని గ్రౌండ్ ప్లోర్లో మంటలు ఎందుకు వ్యాపించాయి. ఎలా ప్రమాదం జరిగింది అనే విషయాలను మాత్రం గుర్తించలేదు. ఈ ప్రమాదం గురించి సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో సమాచారం వచ్చినట్లు చెబుతున్నఅగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బిల్డింగ్ లో మనుషులు చిక్కుకున్నారనే సమాచారంతో.. ల్యాడర్ ద్వారా పైకి వెళ్లిన సిబ్బంది.. తలుపులు పగులగొట్టి బాధితుల్ని కాపాడారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×