E-Paper
Advertisement

Huzurabad Crime : టిప్పర్ బోల్తా.. మట్టిలో కూరుకుపోయి ముగ్గురు దుర్మరణం

Huzurabad Crime : టిప్పర్ బోల్తా.. మట్టిలో కూరుకుపోయి ముగ్గురు దుర్మరణం
Advertisement

Huzurabad Accident Update

Huzurabad Accident Update (Today Breaking news in Telangana): కరీంనగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. హుజురాబాద్ సమీపంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మృతుల్లో అన్నాచెల్లెళ్లు కూడా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమ్మతల్లి బోనాల జాతరకు వెళ్లి తిరిగి బైక్ పై ఇంటికి వెళ్తున్నారు. హుజురాబాద్ మండలం బోర్నపల్లి మూలమలుపువద్ద మట్టిలోడ్ తో వస్తున్న టిప్పర్ అదుపుతప్పి తిరగబడటంతో ఆ మట్టి బైక్ పై వెళ్తున్న ముగ్గురిపై పడింది.

Advertisement

Also Read : చల్లటి కబురు.. రేపట్నుంచి వర్షాలు.. హైదరాబాద్ లో మాత్రం ?

ముగ్గురూ మట్టిలో కూరుకుపోయారు. అప్రమత్తమైన స్థానికులు మట్టిని తీసి వర్ష, విజయ్, సింధుజలను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విజయ్, సింధుజ మరణించగా.. వర్ష చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతులంతా బోర్నపల్లికి చెందినవారేనని పోలీసులు తెలిపారు. విజయ్, వర్షలను అన్నచెల్లెళ్లుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుజురాబాద్ ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో విజయ్, వర్షల తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఈ ముగ్గురి మృతదేహాలకు హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయనున్నారు. పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

 

 

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×