E-Paper
Advertisement

Thief Murder : గుడిలో చోరికి ప్రయత్నం.. దొంగ హతం..

Thief Murder : గుడిలో చోరికి ప్రయత్నం.. దొంగ హతం..
Advertisement

Thief Murder : మేడ్చల్‌ జిల్లా కుషాయిగూడ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఓ దుండగుడు ప్రవేశించాడు. గర్భగుడిలోని హుండీ వద్దకు వెళ్లాడు. ఆ హుండీని పగల గొట్టేందుకు ప్రయత్నించాడు. ఆ శబ్దానికి ఆలయ వాచ్ మెన్ రంగయ్య మేల్కొన్నాడు. దొంగను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో దుండగుడు రంగయ్యపై రాళ్లతో దాడికి దిగాడు. ఈ క్రమంలో వాచ్ మెన్ తన వద్ద ఉన్న కర్రతో దొంగను బలంగా కొట్టాడు. దుండగుడి తలకు బలంగా దెబ్బ తగిలింది. వెంటనే అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.

ఉదయం ఆలయానికి వచ్చిన అధికారులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు. మృతుడి వద్ద దొరికిన ఫోన్ ఆధారంగా వివరాలు సేకరించారు. దొంగతనానికి వచ్చిన దుండగుడుని గండం రాజుగా గుర్తించారు. అతడి స్వస్థలం కామారెడ్డి జిల్లా ఆరేపల్లిని పోలీసులు తెలిపారు. ప రాజు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. రాజు హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×