E-Paper
Advertisement

Theft in mortuary : శవాలను కూడా వదలరా? మార్చురీలోనూ.. ఇంత దారుణమా?

Theft in mortuary : శవాలను కూడా వదలరా? మార్చురీలోనూ.. ఇంత దారుణమా?
Advertisement

Theft in mortuary : కొన్ని ఘటనలు మానవత్వానికే మచ్చ తెస్తుంటాయి. వీళ్లు మనుషులేనా.? అనేలా చేస్తుంటాయి. అలాంటి ఘటనే జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగింది. సాటి మనిషి చనిపోయిందన్న కనీస కనికరం లేని కొందరు.. శవం దగ్గర సైతం దొంగతానికి పాల్పడ్డారు. అదేమంటే.. మాకేం తెలుసంటూ దబాయించారు. దాంతో.. కూతురు చనిపోయిందని బాధపడాలో, ఇలాంటి మనుషుల మధ్య బతుకుతున్నామని భయపడాలో తెలియని స్థితిలో.. లబోదిబోమంటున్నారు.. బాధిత కుటుంబసభ్యులు.

గద్వాల్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ లో గురువారం ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో మెరిస్సా అనే మహిళ మృతి తీవ్రంగా గాయపడి మరణించింది. దాంతో.. ఆమెను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు.. నివ్వెరపోయే విషయాన్ని గమనించారు. ప్రయాణ సమయంలో ఆమె ధరించిన బంగారం, మార్చురీకి తీసుకువచ్చిన తర్వాత కనిపించకుండా పోయింది.

Advertisement

దాంతో అవ్వాకైన మహిళ కుటుంబ సభ్యులు.. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీ సిబ్బందిని అడిగారు. సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకున్న మార్చురీ సిబ్బంది.. మీరే తీసారేమోనంటూ దబాయించారు. ఎంత ప్రయత్నించినా, ఎన్నిసార్లు అడిగినా.. సమాధానమివ్వలేదని మృతి చెందిన మహిళ కుటుంబ సభ్యులు వాపోయారు. అసలే మా కూతురు చనిపోయిందన్న దుఃఖంలో ఉన్న తమకు.. మృతదేహంపై ఉన్న బంగారు దొంగిలించడం మరింత బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మానవ విలువలు లేకుండా ఇలా చేయడం.. ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు.

Also Read : 16 ఏళ్ల స్టూడెంట్‌ని కిడ్నాప్ చేసిన మహిళా టీచర్.. లింగమార్పిడి చేసుకొని పెళ్లికోసం..

Advertisement

పోస్టుమార్టం సమయంలోనూ మృతదేహంపై బంగారం ఉన్నట్లు వివరాలు అందించామని చెబుతున్న బాధిత కుటుంబ సభ్యులు.. సుమారు తులం బంగారు అపహరించారి వాపోతున్నారు. సంబంధిత మార్చురీ సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకుని.. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×