E-Paper
Advertisement

TG : మంత్రులకు ఆ పవర్ కట్?

TG : మంత్రులకు ఆ పవర్ కట్?
Advertisement

రాష్ట్ర మంత్రులకు రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇంతకాలం వారికి ఉన్న కొన్ని పవర్స్‌ను కట్ చేసింది. ఎందుకంటే అవినీతి, అక్రమాలను నివారించేందుకే అని సర్కారు క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ మంత్రులకు కట్ చేసిన పవర్ ఏంటి? అని కొందరు నేతలు ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. అదేంటంటే, సీఎంఆర్ఎఫ్ అమలులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం సహాయ నిధి అమలులో ఇకపై మంత్రుల పాత్రను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మంత్రులు ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల ప్రజలకు సీఎంఆర్ఎఫ్ సిఫార్సులు ఇచ్చేవారు.కానీ, ఇక నుంచి మంత్రులు సైతం వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం వెల్లడించింది.

సెగ్మెంటుకే పవర్ పరిమితం..

సీఎంఆర్ఎఫ్ చెక్ పవర్‌ను నియోజకవర్గానికే పరిమితం చేయడం వలన పారదర్శకత నెలకొంటుందని సర్కారు భావిస్తున్నది.అందుకు సదరు మంత్రి ఏ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారో.. అక్కడి ప్రజలకు మాత్రమే సీఎంఆర్ఎఫ్ ప్రయోజనం అందనుంది.ఇప్పటి నుంచి ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గానికి చెందిన చిరునామా ఉన్న అభ్యర్థులకు మాత్రమే సీఎంఆర్ఎఫ్ టోకెన్ చేయాలని ప్రభుత్వం సూచించింది. అంతేకాకుండా ఇక పైనుంచి దరఖాస్తులను సైతం పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. దరఖాస్తుదారులు తమ వివరాలు, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. చెక్కుల జారీ, రీవాలిడేషన్ ప్రక్రియ కూడా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతుంది.

ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు..

Advertisement

సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇకపై సీఎంఆర్ఎఫ్ సహాయం పొందాలంటే దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుంది. దీనికోసంప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది.ఇంతకుముందు సీఎంఆర్ఎఫ్ చెక్కులో మార్పులు అవసరమైతే మాన్యువల్ విధానం ఉండేది. ప్రస్తుతం ఆ ప్రక్రియను మార్చి సీఎంఆర్ఎఫ్ చెక్ రీ వాలిడేషన్ ప్రాసెస్‌ను ప్రజాప్రతినిధుల లాగిన్‌లో చేర్చారు. చెక్కులో మార్పులు కోరుకునే వారు ఇక నుంచి సంబంధిత స్థానిక ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.ప్రజాప్రతినిధి కార్యాలయ సిబ్బంది అసలు దరఖాస్తును సెక్రెటేరియట్‌లోని సీఎంఆర్ఎఫ్ విభాగానికి పంపించాలి. కొత్త చెక్కు సంబంధిత ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందికే అందిస్తారు.

రఘురామ కృష్ణరాజుకు ఢిల్లీ కోర్టులో ఊరట.. బ్యాంకు రుణాల కేసులో బెయిల్ మంజూరు
ఈ విధానం ద్వారా పారదర్శకత పెరుగుతుంది. దరఖాస్తు ఆమోదం పొందిన తరువాత మాత్రమే చెక్కులు జారీ చేస్తారు.అవసరమైన వివరాలు, పత్రాలు సరిచూసిన తరువాతే చెల్లింపులు జరుగుతాయి. ఇక గడువు ముగిసిన చెక్కుల రీవాలిడేషన్ కూడా ఆన్‌లైన్‌లోనే చేయాల్సి ఉంటుంది. గతంలో నకిలీ మెడికల్ బిల్లులు, మధ్యవర్తుల ద్వారా జరిగిన దుర్వినియోగం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ఈ మేరకు కఠిన చర్యలు చేపట్టింది. భవిష్యత్‌లో ప్రజలు నేరుగా అధికారిక మార్గాల ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలని సూచించింది.దరఖాస్తులకు ఎమ్మెల్యేలు లేదా అధికార ప్రతినిధుల సిఫార్సు తప్పనిసరి.ప్రతీ దరఖాస్తును వైద్య నిపుణుల బృందం పరిశీలించిన తరువాతే ఆమోదం ఇవ్వనున్నారు.దరఖాస్తుదారులు సరైన పత్రాలు సమర్పించి అధికారిక మార్గాలను మాత్రమే అనుసరించాలని సూచించారు.

Advertisement

 

 

 

 

 

 

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×